Mansoor Ali Khan: పార్టీ పెట్టి చిరంజీవి వేల కోట్లు సంపాదించారు!

  • November 28, 2023 / 08:07 PM IST

కోలీవుడ్ నటుడు మన్సూర్ అలీఖాన్ త్రిష గురించి చేసినటువంటి వ్యాఖ్యలు ఎలాంటి దుమారం రేపాయో అందరికీ తెలిసిందే. ఇలా ఈయన త్రిష గురించి మాట్లాడటంతో ఎంతో మంది సెలబ్రిటీలో ఆయనకు మద్దతుగా నిలబడ్డారు. టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి మెగాస్టార్ చిరంజీవి కూడా త్రిష కు మద్దతు తెలుపుతూ మన్సూర్ అలీ ఖాన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే మనసు అలీ ఖాన్ కూడా తన పరువుకు భంగం కలిగించిన వారిపై కేసు వేయబోతున్నాను అంటూ షాకింగ్ న్యూస్ వెల్లడించారు.

నేను మాట్లాడిన వ్యాఖ్యలను కొందరు తప్పుగా ఎడిట్ చేశారని నిజమైన వీడియోని షేర్ చేసినప్పటికీ పలువురు సెలబ్రిటీలు నా పరువుకు భంగం కలిగించారు అందుకే నేను పరువు నష్టం దావా వేయబోతున్నానని తెలిపారు. ముఖ్యంగా చిరంజీవి త్రిష కుష్బూపై తాను కేసు వేయబోతున్నట్లు ప్రకటించారు. అయితే తాజాగా మరోసారి చిరంజీవి గురించి మన్సూర్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ చిరంజీవి ప్రతిసారి ఓల్డ్ హీరోయిన్లకు పెద్ద ఎత్తున పార్టీలో ఇస్తుంటారు ఆయన కేవలం హీరోయిన్లకు మాత్రమే పార్టీలు ఇస్తుంటారు ఆ పార్టీలకు మమ్మల్ని ఎప్పుడూ పిలవలేదు.

ఇలా చిరంజీవి ఇచ్చే పార్టీకి మమ్మల్ని పిలవడం పిలవకపోవడం పూర్తిగా ఆయన ఇష్టమని ఈయన తెలిపారు. నాకు సంబంధించిన ఒక విషయం జరిగినప్పుడు చిరంజీవి గారు స్పందించే సమయంలో ఒకసారి నాకు ఫోన్ చేసి ఏం జరిగింది అనే విషయాలు తెలుసుకుని ఉంటే బాగుండేదని అలా కాకుండా ఎవరో చెప్పినది విని నా గురించి అలా మాట్లాడటం చాలా బాధ కలిగించిందని (Mansoor Ali Khan) ఈయన తెలియజేశారు.

ఇక చిరంజీవి పొలిటికల్ గురించి కూడా ఈయన మాట్లాడారు చిరంజీవి పార్టీ పెట్టి వేలకోట్లు తిన్నారని ఏ పేదలకు ఎలాంటి సహాయం చేయలేదని మన్సూర్ షాకింగ్ విషయాలను వెల్లడించారు. అందుకే నేను ఈ ముగ్గురిపై పరువు నష్టం కేసు వేసి దాని ద్వారా వచ్చిన డబ్బును మందు తాగి చనిపోయినటువంటి వారి కుటుంబాలకు సహాయం చేస్తాను అంటూ ఈ సందర్భంగా చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.

ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus