మారుతి దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్

  • May 31, 2016 / 11:08 AM IST

సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, సుప్రీమ్ హిట్ లతో జోరుమీదున్న మెగా హీరో సాయి ధరమ్ తేజ్ మరో ప్రాజక్ట్ కి ఓకే చెప్పాడు. ప్రస్తుతం బీఆర్ దుగ్గినేని దర్శకత్వంలో “తిక్క” షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు. ఈ చిత్రాన్ని నవంబర్లో రిలీజ్ చేయడానికి “తిక్క” బృందం వేగంగా పనిచేస్తోంది. ఈ సినిమా పూర్తి అయిన వెంటనే రెస్ట్ తీసుకోకుండా డాన్ శీను, బాడీగార్డ్, బలుపు, పండగ చేస్కో వంటి విజయాలు అందుకున్న డైరక్టర్ గోపీచంద్ మలినేని తో కలిసి పని చేయనున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తి అయ్యింది. ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లక ముందే మారుతి దర్శకత్వంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
భలే భలే మగాడివోయ్ విజయంతో ఫుల్ ఫామ్ లోకి వచ్చిన మారుతి.. వెంకటేష్ తో “బాబు బంగారం” చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా నిర్మాణం తుది దశకు చేరుకుంది. ఈ డైరక్టర్ సాయి ధరమ్ తేజ్ కు కథ వినిపించారు. హీరోకి మారుతి చెప్పిన కథ నచ్చడంతో వెంటనే ఓకే చెప్పాడంట. “బాబు బంగారం” థియే టర్లోకి వెళ్ళగానే మారుతి సాయి సినిమా స్క్రిప్ట్ రాయడంలో నిమగ్నం కానున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus