Peddi: ఫైనల్లీ… ‘పెద్ది’ ఇష్యూని సాల్వ్ చేసిన చిరు

Advertisement

టాలీవుడ్‌లో గత కొన్ని రోజులుగా ఎగ్జిబిటర్లకు, నిర్మాతలకి మధ్య నలుగుతున్న ‘పర్సంటేజీ’ వివాదం ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చింది అనే చెప్పాలి.

Peddi

గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ నటించిన ‘పెద్ది’(Peddi) సినిమా విడుదలపై నెలకొన్న సందిగ్ధతకు మెగాస్టార్ చిరంజీవి ఎంట్రీతో ఫుల్స్టాప్ పడినట్టైంది. సినీ పరిశ్రమకి నష్టం కలగకుండా ఆయనతో జరిపిన చర్చలను ఆధారం చేసుకుని ఎగ్జిబిటర్లు ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు.

వారి ఒప్పందం ప్రకారం.. ‘పెద్ది’ సినిమాను పాత పద్ధతి లో అంటే ‘రెంటల్ విధానం’లోనే థియేటర్లలో ప్రదర్శించనున్నారు. అయితే, ఒకవేళ టికెట్ ధరలు పెంచితే, ఆ పెంచిన మొత్తంలో వచ్చే దానికి 7.5 శాతం అదనపు వాటాను ఎగ్జిబిటర్లకు ఇచ్చేలా ఇరువర్గాలు ఒక అంగీకారానికి వచ్చాయి. ఇది అటు నిర్మాతలకు, ఇటు ఎగ్జిబిటర్లకి పెద్ద ఊరట అనే చెప్పాలి.ఇక చాలా కాలంగా చర్చల్లో ఉన్న పర్సంటేజీ విధానం పై కూడా ఓ నిర్ణయం తీసుకున్నారు.

జూన్ 30 తర్వాత థియేటర్లలో రిలీజ్ అయ్యే సినిమాలకి పూర్తిస్థాయిలో పర్సెంటేజీ విధానం అమల్లోకి రానుంది. దీనికి కూడా నిర్మాతలు, డిస్ట్రిబూటర్లు అంగీకారం తెలిపారు. మెగాస్టార్ చొరవతో ఈ సమస్య ఓ కొలిక్కి వచ్చింది. రామ్ చరణ్ సినిమా మేకర్స్ కి కూడా ఓ టెన్షన్ తీరినట్టే. ఇండస్ట్రీలో ఇలాంటి సమస్యలు వచ్చిన ప్రతిసారి మెగాస్టార్ చిరంజీవి ఎంటర్ అయ్యి సాల్వ్ చేస్తూ వస్తున్నారు. ఆయన ఇన్వాల్వ్ కాకుండా ఏ సమస్యకి కూడా సరైన పరిష్కారాలు దొరకడం లేదు అనే చెప్పాలి.

రవితేజ ‘ఇరుముడి’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus