Meher Ramesh: మళ్లీ కుస్తీకి సిద్ధమవుతున్న మెహర్‌ రమేష్‌!

  • October 8, 2021 / 04:40 PM IST

‘గాడ్‌ఫాదర్‌’ తర్వాత చిరంజీవి చేయబోయే సినిమా ఏంటి? ఈ ప్రశ్నకు సమాధానం ఇంత త్వరగా తేలేటట్లు లేదు. ఎందుకంటే చిరంజీవి తర్వాతి దర్శకుల జాబితాలో ఇద్దరు ఉన్నారు. ఒకరు మెహర్‌ రమేశ్‌ కాగా, మరొకరు బాబి. అయితే ఈ ఇద్దరిలో తొలుత ఎవరితో చిరంజీవి సినిమా చేస్తారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తమిళంలో విజయమవతమైన ‘వేదాళం’ను తెలుగులో ‘భోళా శంకర్‌’గా తీసుకొస్తున్నారు మోహర్‌ రమేశ్‌. చిరంజీవి 154 సినిమాను బాబీ డైరెక్ట్‌ చేస్తున్నారు.

ముందుగా చెప్పిన లెక్క ప్రకారం అయితే ‘గాడ్‌ ఫాదర్‌’ అయిపోయిన వెంటనే… చిరంజీవి ‘భోళా శంకర్‌’ సినిమా మొదలుపెట్టాలి. ఆ తర్వాతే బాబీ సినిమా రావాలి. కానీ పరిస్థితి చూస్తుంటే ఆ మధ్య ఎప్పుడో వచ్చిన పుకార్లు నిజమయ్యేలా ఉన్నాయి. అంటే బాబీ సినిమానే తొలుత ప్రారంభమయ్యేలా ఉంది. కారణం ‘భోళా శంకర్‌’ స్క్రిప్ట్‌ విషయంలో చిరంజీవి అంత సంతృప్తిగా లేరట. దీంతో మరోసారి కుస్తీకి సిద్ధమవుతున్నారట మెహర్‌ రమేశ్‌.

మెహర్‌ రమేశ్‌ నెరేట్‌ చేసిన స్క్రిప్ట్‌ విషయంలో చిరంజీవి కొన్ని సూచనలు చేశారట. దీంతో రమేశ్‌ అండ్‌ టీమ్‌ మరోసారి స్టోరీ బోర్డు మీద కూర్చుంటున్నారని తెలుస్తోంది. ఆ లెక్కన ఈ పని అవ్వడానికి రెండు నెలలు పడుతుందని టాక్‌. ఈలోగా ఖాళీగా ఉండకుండా… బాబీ సినిమా స్టార్ట్‌ చేయాలని చిరంజీవి భావిస్తున్నారట. విజయదశమి సందర్భంగా ఈ సినిమా ముహూర్తం ఉండొచ్చని టాక్‌.

రిపబ్లిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus