MM Srilekha, Rajamouli: సినిమాలతో బిజీ బిజీగా మారిపోయారు?

  • August 13, 2022 / 12:26 PM IST

తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శక దీరుడిగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న ఎస్ఎస్ రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన సినిమా వస్తుందంటే చాలు బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ కాయమని అందరూ భావిస్తుంటారు. ఇకపోతే తాజాగా రాఖీ పండుగ సందర్భంగా రాజమౌళి గురించి ఆయన సోదరి ఎంఎం శ్రీలేఖ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అయితే ఈమె రాజమౌళి గురించి ఈ వ్యాఖ్యలు గతంలో చేసినప్పటికీ రాఖీ పౌర్ణమి సందర్భంగా ఈ వ్యాఖ్యలు మరోసారి ట్రెండ్ అవుతున్నాయి.

ఈ వీడియోలో భాగంగా శ్రీలేఖ తన అన్నయ్యలకు కీరవాణి రాజమౌళి గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. చిన్నప్పటి నుంచి సినీ, సంగీత నేపథ్యం ఉన్న కుటుంబంలో పెరగటం వల్ల తనకు కూడా సంగీతంపై ఎంతో మక్కువ ఏర్పడిందని ఈమె తెలిపారు. ఇకపోతే తనకు కీరవాణి పాడిన పాటలలో తెలుసా మనసా అనే పాట ఇష్టమని తెలిపారు. కీరవాణి పాటల తరువాత తనకు ఇళయ రాజ పాటలు అంటే ఇష్టమని చెప్పారు.

ఇకపోతే రాజమౌళితో తనకి ఎంతో మంచి అనుబంధం ఉందని ఆయన గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలిపారు. ఇక రాజమౌళి సినిమాలకు డైరెక్టర్ కాకముందు సీరియల్స్ డైరెక్ట్ చేసేవారు. శాంతినివాసం సీరియల్ సమయంలో రాజమౌళి అన్నయ్య తనకు ఎన్నో చాక్లెట్స్ తెచ్చి ఇచ్చేవారు.

ఇప్పుడు ఆయన పెద్ద డైరెక్టర్ అయిన తర్వాత పూర్తిగా మారిపోయారు. డైరెక్టర్ అయిన తర్వాత కనీసం పలకరించడానికి కూడా వీలు లేకుండా పోతుందని తెలిపారు. ఈయన డైరెక్టర్ అయిన తర్వాత ఎక్కువ పని ఒత్తిడి బిజీ కావటం వల్ల ముందులాగా అందరితో సమయం కేటాయించలేకపోతున్నారని శ్రీలేఖ రాజమౌళి గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈమె చేస్తున్న ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus