చిరు రీమేక్ కి డైరెక్టర్ దొరికినట్లేనా..!

  • November 21, 2020 / 03:55 PM IST

మలయాళంలో మోహన్ లాల్ హీరోగా తెరకెక్కి సక్సెస్ అందుకున్న ‘లూసిఫర్’ సినిమాను మెగాస్టార్ చిరంజీవి తెలుగులో రీమేక్ చేయడానికి సిద్ధమయ్యారు. అయితే ఈ సినిమాను తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా మార్పులు చేయడానికి ముందుగా స్క్రిప్ట్ ని ‘సాహో’ డైరెక్టర్ సుజీత్ చేతిలో పెట్టారు. కానీ ఆయన ఆయన చేసిన మార్పులు చిరుకి నచ్చకపోవడంతో.. మాస్ డైరెక్టర్ వి.వి.వినాయక్ ను రంగంలోకి దింపారు. కొద్దిరోజుల క్రితం వినాయక్ కూడా తప్పుకోవడంతో.. హరీష్ శంకర్ పేరు తెరపైకి వచ్చింది.

అయితే తాను ఆ సినిమా చేయడం లేదని హరీష్ శంకర్ క్లారిటీ ఇచ్చారు. తాజాగా ఈ లిస్ట్ లో మరో డైరెక్టర్ పేరు వచ్చి చేరింది. అతడే మోహన్ రాజా. కోలీవుడ్ లో ఎన్నో హిట్ సినిమాలను డైరెక్ట్ చేశారు. ఆయన రూపొందించిన ‘తని ఒరువన్’ చిత్రాన్ని రామ్ చరణ్ ‘ధ్రువ’ పేరుతో రీమేక్ చేశారు. తెలుగులో ఎన్నో చిత్రాలకు సమర్పకుడిగా వ్యవహరించిన ఎడిటర్ మోహన్ కుమారుడే ఈ మోహన్ రాజా. మెగాస్టార్ కి ఎడిటర్ మోహన్ కుటుంబంతో మంచి రిలేషన్ ఉంది.

మోహన్ రాజా దర్శకుడిగా కోలీవుడ్ లో సెటిల్ అయినప్పటికీ ఆయన తెరంగేట్రం మాత్రం తెలుగు సినిమాతోనే జరిగింది. చాలా రోజులుగా మోహన్ రాజా… రామ్ చరణ్ తో పాన్ ఇండియా సినిమా చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కానీ ఇప్పుడు మెగాస్టార్ రీమేక్ కోసం ఆయన పేరు వినిపిస్తోంది. చిరు చెప్పినట్లుగా మార్పులు చేయడానికి మోహన్ రాజా సిద్ధంగా ఉన్నారు. దీనిపై మెగా కాంపౌండ్ నుండి అధికార ప్రకటన వస్తుందేమో చూడాలి!

Most Recommended Video

మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమా రివ్యూ & రేటింగ్!
అనగనగా ఓ అతిధి సినిమా రివ్యూ & రేటింగ్!
రెండు చేతులా సంపాదిస్తున్న 13 హీరోయిన్లు..వీళ్లది మామూలు తెలివి కాదు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus