ఎన్టీఆర్ ని ఆహ్వానిస్తున్న మోహన్ లాల్

  • January 19, 2017 / 10:38 AM IST

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి జనతా గ్యారేజ్ మూవీలో నటించారు. ఆ మూవీ బ్లాక్ బస్టర్ అయింది. ఈ సినిమా చిత్రీకరణలో వీరిద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. ఆ స్నేహం తోటే ఎన్టీఆర్ ని మోహన్ లాల్ తన సినిమా ఆడియో వేడుకకు గెస్ట్ గా రావాలని ఆహ్వానించారు. మోహన్ లాల్ హీరోగా మలయాళంలో రూపొందిన ‘ఒప్పం’ చిత్రం అక్కడ భారీ కలక్షన్స్ సాధించింది. ఈ సినిమాను ‘కనుపాప’ పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మోహన్ లాల్ ప్రయత్నిస్తున్నారు.

ఫిబ్రవరి 3వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 25వ తేదీన సినిమా ఆడియో ఫంక్షన్ ను హైదరాబాద్ లో నిర్వహించడానికి అంతా సిద్ధం చేశారు. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ ని మోహన్ లాల్ ఆహ్వానించారు. ఎలాగైనా రావాలని పట్టుబట్టినట్లు సమాచారం. ఆయన పిలుపు తారక్ ఫంక్షన్ కి హాజరవుతారా? లేదా ? అనేది.. మరికొన్ని రోజుల్లో తెలియనుంది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus