సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ చేయనున్న సినిమాపై క్లారిటీ!

  • September 17, 2016 / 02:34 PM IST

అనేక వాయిదాల తర్వాత  “రన్ రాజా రన్” ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేయనున్న సినిమా ముహూర్తం ఖరారు అయింది. మిర్చి రిలీజ్ సందర్భంగా డార్లింగ్ ఇచ్చిన మాటకు కట్టుబడి ఈ సినిమా చేస్తున్నారు. మిర్చిని నిర్మించిన యువీ క్రియేషన్స్ వారే ఇందుకు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

ప్రభాస్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ కోసం 100 కోట్లు ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నారు.  ఈ చిత్రంలోని ప్రధాన యాక్షన్ సీక్వెన్స్ ను దుబాయిలో చిత్రీకరించడానికి సుజీత్ ప్లాన్ చేస్తున్నారు. ఇందుకోసం అత్యంత ఖరీదైన కార్లను బుక్ చేశారు. ఇలా  ప్రీ ప్రోడక్షన్ వర్క్ ని పక్కాగా పూర్తి చేసిన సుజీత్ తాజాగా సినిమా ప్రారంభపు డేట్ ని ఫిక్స్ చేశారు. డిసెంబర్ 10 న సినిమా ముహూర్తపు షాట్ ని తీయనున్నట్లు వెల్లడించారు.

జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ ఉంటుందని స్పష్టం చేశారు. ప్రభాస్ ప్రస్తుతం బాహుబలి కంక్లూజన్ కోసం పాట చిత్రీకరణలో పాల్గొంటున్నారు. అనుష్క తో సాంగ్ పూర్తి అయినా తర్వాత మిగిలిన కొన్ని సీన్లను దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమోళి అక్టోబర్ లో కంప్లీట్ చేయనున్నారు. దీంతో ప్రభాస్ రిలాక్స్ అవుతారు. ఒక నెల రెస్ట్ తీసుకొని కొత్త సినిమా పనుల్లోకి అడుగు పెడతారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus