నటి సాక్షి శివానంద్ పై ఆరోపణలు!

  • July 26, 2019 / 06:17 AM IST

అప్పట్లో స్టార్ హీరోలందరితోనూ నటించి మంచి క్రేజ్ సంపాదించుకుంది సాక్షి శివానంద్. మెగాస్టార్ చిరంజీవితో ‘మాష్టర్’ , ‘కింగ్’ నాగార్జునతో ‘సీతా రామరాజు’, బాలకృష్ణతో ‘వంశోద్ధారకుడు’, మహేష్ బాబు తో ‘యువరాజు’ వంటి బడా చిత్రాల్లో నటించి ప్రేక్షకులకి మరింత దగ్గరైంది. ఆ తరువాత నటించిన సినిమాల్లో ఒక్క ‘సింహరాశి’ తప్ప మరే చిత్రం హిట్టవ్వకపోవడంతో ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. ఆ తరువాత సాక్షి సోదరి శిల్పా ఆనంద్… మంచు విష్ణు హీరోగా వచ్చిన ‘విష్ణు’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రం ప్లాపవ్వడంతో మళ్ళీ అడ్రెస్స్ లేదు శిల్పా. ఇదిలా ఉంటే.. తాజాగా సాక్షి శివానంద్ పై తన సోదరి శిల్పా ఆనంద్ చేసిన ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. సాక్షి శివానంద్ తనను చంపాలని చూస్తోందని శిల్పా ఆనంద్ చేసిన కామెంట్స్ ఇప్పుడు తెగ వైరలవుతున్నాయి.

‘సాక్షి శివానంద్.. భీమా డబ్బుల కోసం తన అత్తతో కలిసి శిల్పా ఆనంద్ ని చంపాలని చూస్తోందట. ‘సొంత అక్క ఇలా చంపడానికి ప్రయత్నిస్తుండడమేంటని’ సోషల్ మీడియాలో పోస్ట్ ద్వారా తన ఆవేదన వ్యక్తం చేస్తుంది శిల్పా ఆనంద్. సాక్షి శివానంద్ అత్త… భావన భీమా డబ్బుల కోసం కట్టుకున్న భర్తను చంపేసిందని శిల్పా చెబుతుంది. ఆ సమయంలో శిల్పా తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసిందట. ఇప్పుడు సాక్షి.. అదే భీమా డబ్బుల కోసం తన అత్తతో కలిసి తనను, తన తల్లిని చంపాలని చూస్తున్నారంటూ శిల్ప చెప్పుకొస్తుంది. పోలీసులు ఎక్కడ పట్టుకుంటారోనని భావాన అమెరికాకు పారిపోయిందని.. ఆమె ఎప్పుడొస్తే అప్పుడు అరెస్ట్ చేయడానికి పోలీసులు సిద్ధంగా ఉన్నారని చెబుతుంది. ఈ విషయంలో అభిమానులు, సన్నిహితులు తనకి సాయం చేయాలంటూ… పేర్కొంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus