పూణే కంటే ముందు బ్యాంకాక్ లో ఫైట్ ప్లాన్ చేసిన మురుగదాస్
- January 23, 2017 / 01:27 PM ISTByFilmy Focus
సూపర్ స్టార్ మహేష్ బాబు, కమర్షియల్ డైరక్టర్ మురుగదాస్ కాంబినేషన్లో వస్తున్న మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. కొన్నిరోజులుగా అన్నపూర్ణ సెవన్ ఏకర్స్ స్టూడియోలో వేసిన హైదరాబాద్ రోడ్ సెట్ లో చిత్రీకరణ సాగుతోంది. ప్రిన్స్, హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, విలన్ ఎస్.జె.సూర్య లపై కొన్ని కీలక సీన్స్ తెరకెక్కిస్తున్నారు. ఈ షెడ్యూల్ ఈ నెల 30 వరకు కొనసాగుతుందని చిత్ర బృందం తెలిపింది. ఇక్కడ షెడ్యూల్ పూర్తి అయిన వెంటనే పూణే కి వెళ్లాలని భావించింది. తాజాగా ఈ షెడ్యూల్ లో మార్పు చేసినట్లు నిర్మాత ఠాగూర్ మధు చెప్పారు.
పూణే కంటే ముందుగానే బ్యాంకాక్ కి వెళ్లి అక్కడ చిన్న యాక్షన్ సీక్వెన్స్ చేయనున్నట్లు వెల్లడించారు. అక్కడి నుంచి తిరిగి వచ్చాక పూణే, ముంబై ప్రాంతాల్లో షూటింగ్ ఉంటుందని వివరించారు. ఫిబ్రవరి చివరి నాటికి టాకీ పార్ట్ మొత్తం పూర్తి అవుతుందని, ఆ తర్వాత మిగిలిన రెండు పాటల కోసం విదేశాలకు వెళ్తామని స్పష్టం చేశారు. వంద కోట్ల బడ్జెట్ తో ఏక కాలంలో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ జనవరి 26 న విడుదల చేయనున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.













