బాలకృష్ణ గురించి ముస్కాన్ ఏమి చెప్పిందంటే ?

  • September 1, 2017 / 02:04 PM IST

డేరింగ్ డైరక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నటసింహ నందమూరి బాలకృష్ణ నటించిన చిత్రం పైసా వసూల్. అత్యంత వేగంగా ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయింది. అందుకే ప్రకటించిన తేదీకంటే నెల రోజుల ముందుగానే సినిమా థియేటర్లోకి వస్తోంది. ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన శ్రియతో పాటు ఢిల్లీ బ్యూటీ ముస్కాన్ కూడా నటించింది. ఆమె మీడియాతో మాట్లాడుతూ బాలకృష్ణ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకుంది. “తొలి సినిమా స్టార్ హీరో తో చేస్తుండడం నాలో కొంత కంగారు ఉండేది. ఆ విషయాన్నీ గమనించిన బాలకృష్ణ గారు సరదాగా నాతో ఉండేవారు. చిలిపి ప్రాంక్ లతో నాలో భయాన్ని పోగొట్టారు. పూర్తి ఆత్మవిశ్వాసంతో నటించేలా చేశారు ” అని వివరించింది.

అంత పెద్ద స్టార్ అయినప్పటికీ సెట్ లో అందరితో కలిసి పోవడం చూస్తుంటే ఆశ్చర్యం వేసిందని బాలకృష్ణ గొప్పతనాన్ని ముస్కాన్ వెల్లడించింది. భవ్య క్రియేషన్స్ బ్యానర్ లో ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ మూవీ  సెప్టెంబర్ 1న రిలీజ్ అవుతుండగా, ఈ మూవీ పాటలను రేపు ఖమ్మం లో జరిగే ఆడియో వేడుకలో విడుదల చేయనున్నారు.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus