దిల్ రాజు, అల్లు అరవింద బాటలో ‘మైత్రి మూవీ మేకర్స్’

  • February 21, 2020 / 01:56 PM IST

ప్రస్తుతం సౌత్ సినిమాలు బాలీవుడ్ లో సంచనాలు సృష్టిస్తున్నాయి. అక్కడి జనాలు సినిమాలు లేక కరువులో ఉన్నారు. చాలా వరకూ థియేటర్లకు వెళ్లడం మానేసి యూట్యూబ్లో మన సినిమాలే చూస్తూ కూర్చుంటున్నారు. ముఖ్యంగా మన టాలీవుడ్ సినిమాల హిందీ డబ్బింగ్ వెర్షన్లకు 100 మిలియన్ల వ్యూస్ వచ్చేస్తున్నాయి. ఇక మన ప్రభాస్ అక్కడ స్ట్రెయిట్ గా చేసిన ‘సాహో’ చిత్రం కూడా హిట్టు కొట్టింది. మన ‘అర్జున్ రెడ్డి’ చిత్రం రీమేక్ చేయగా అక్కడ రికార్డు కలెక్షన్లను రాబట్టింది. దీంతో ఇదే మంచి టైం అని అంతా బాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతున్నారు. ఎలాగూ ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం మన తెలుగు సినిమా మార్కెట్ ను మరింత పెంచడం ఖాయం.

ఇప్పటికే ‘జెర్సీ’ రీమేక్ తో అల్లు అరవింద్, దిల్ రాజు, రాధాకృష్ణ వంటి బడా ప్రొడ్యూసర్లు అక్కడ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పడు ‘మైత్రి మూవీ మేకర్స్’ వారు కూడా బాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ప్రభాస్ తో సినిమా ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇప్పుడు సల్మాన్ ఖాన్ తో కూడా డిస్కషన్లు జరుపుతున్నారట. అర్బాజ్ ఖాన్ మరియు సోహాలి ఖాన్ లతో కలిసి ‘మైత్రి మూవీ మేకర్స్’ వారు పెద్ద ప్రాజెక్ట్ ను సెట్ చేసే పనిలో ఉన్నారట.

Most Recommended Video

‘భీష్మ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘ప్రెజర్ కుక్కర్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus