అందరూ అలా అంటుంటే ఇరిటేటింగ్ గా ఉంది: నబా నటేష్

  • September 18, 2018 / 07:27 AM IST

సాధారణంగా కొత్త కథానాయికలకీ గుర్తింపు రావడమే చాలా అరుదు. ఆ గుర్తింపు కోసం నానా పాట్లు పడుతుంటారు కొందరు కథానాయికలు. కానీ.. పరిచయ చిత్రం ఇంకా విడుదలవ్వకముందే వచ్చిన పబ్లిసిటీ చాలా ఇబ్బందిగా ఉంటోంది అంటోంది కొత్త కథానాయిక నబా నటేష్. “నన్ను దోచుకుందువటే” చిత్రం ద్వారా కథానాయికగా పరిచయమవుతున్న ఈ అమ్మడు ఆల్రెడీ తొలి చిత్రం విడుదలకు ముందే రెండు ఆఫర్లు దక్కించుకొంది. 2013 ఫెమినా మిస్ ఇండియా అయిన నబా నటేష్ ఆల్రెడీ కన్నడలో రెండు సినిమాలు చేసింది. ఇప్పుడు సుధీర్ బాబు సరసన “నన్ను దోచుకుందువటే” చిత్రంతో తెలుగు ప్రేక్షకులను ఈ శుక్రవారం పలకరించేందుకు సన్నద్ధమవుతోంది. ఈమధ్యకాలంలో సోషల్ మీడియాలో అమ్మడి హాట్ ఫోటోస్ హల్ చల్ చేస్తుండడం తెలిసిందే.

అయితే.. నబాకి వచ్చిన కొత్త నొప్పి ఏంట్రా అంటే ఆమెను అందరూ జాన్వి కపూర్ లా ఉన్నావు అంటున్నారట. ముఖ్యంగా “ధడక్” సినిమా విడుదలయ్యాక ఆమెకు ఈ తలపోటు మరింతగా ఎక్కువయ్యిందట. అలా పోల్చడం బాగానే ఉన్నా.. అందరూ అలానే అంటుండడం మాత్రం తనకు నచ్చడం లేదని చెబుతోంది నబా. ఆమె నటించిన మరో చిత్రం “అదుగో” అక్టోబర్ లో విడుదలకు సిద్ధమవుతోంది. చూస్తుంటే అమ్మడు ఇక్కడే గట్టిగా పాగా వేసేలా ఉంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus