Nag Ashwin: నేల కూర్చోవడం గురించి రియాక్ట్‌ అయిన నాగ్‌ అశ్విన్‌.. ఏమన్నాడంటే?

Advertisement

ఓ వ్యక్తిని అంతులేనంతగా అభిమానిస్తే, గురువుగా గొప్పగా గౌరవిస్తే.. ఇలా ఉంటుందా? అనేలా ఇటీవల ఓ పని చేశారు ప్రముఖ దర్శకుడు నాగ్‌ అశ్విన్‌. ఆయన నిర్మాణంలో ఈ తరం ప్రేక్షకులకు లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ద్వారా అందిస్తున్న కానుక ‘సింగ్‌ గీతం’. 94 ఏళ్ల వయసులో సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన ఆ సినిమా ఈ రోజు విడులైంది. ఈ క్రమంలో ఈ సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో నాగ్‌ అశ్విన్‌ చేసిన పని గురించి ఇంకా చర్చ జరుగుతూనే ఉంది.

Nag Ashwin

ఈ విషయంలో తాజాగా ఆయనే స్పందించారు. చెన్నైలో జరిగిన వేడుకలో చెప్పుల్లేకుండా కింద కూర్చోవడంపై నాగీని ప్రశ్నించగా.. ఆ రోజు సింగీతం శ్రీనివాసరావు వీల్‌ చైర్‌లో స్టేజ్‌పైకి వెళ్తున్నారు. అప్పుడు నేను అక్కడే కూర్చుని ఉన్నాను. ఆ సమయంలో నా చెప్పులు అడ్డంగా ఉన్నాయని వాటిని పక్కకు జరిపి కింద కూర్చున్నా. అది ఎవరైనా రికార్డ్‌ చేస్తున్నారని తెలిసుంటే కుర్చీలోనే కూర్చునేవాణ్ని అంటూ ఏం జరిగిందో చెప్పారు నాగ్‌ అశ్విన్‌. నాగీ ఇలా అంటున్నా.. సింగీతంను చూస్తే ఆయన మైమరిచిపోవడం అందరికీ కనిపించింది కూడా.

ఇక ఈ సినిమా గురించి నాగీ మాట్లాడుతూ ఇలాంటి చిత్రం ఇంతవరకు ఇండియన్‌ సినిమాలో రాలేదని.. మరో 10 ఏళ్ల తర్వాత కూడా ఈ సినిమా మాట్లాడుకోవాలనే ఉద్దేశంతో తెరకెక్కించామని చెప్పారు. సింగీతం జెన్‌ ఆల్ఫా లాంటి వ్యక్తని కొనియాడారు. మాటలే పాటలుగా మారితే ఎలా ఉంటుందనే ఆలోచనతో ‘సింగ్‌ గీతం’ సినిమాను రూపొందించినట్లు తెలిపారు.

అన్నట్లు ఆ రోజు చెన్నై ఈవెంట్‌లో స్టేజీ మీద సింగీతం మాట్లాడుతూ నాగ్ అశ్విన్ సినిమాల కంటే తననే ఎక్కువగా ప్రేమిస్తాడని అనడం గమనార్హం. నాపై ఎంతో అభిమానం, గౌరవంతో నాతో సినిమా చేయించారు. ఇది ఆయన క్రెడిట్. ‘సింగ్ గీతం’ సినిమా మొత్తాన్ని ఆయనే వెనుక ఉండి ముందుకు తీసుకెళ్లారు అని చెప్పారు. ఇదన్నమాట ఆయన అభిమానం, ఈ వాత్సల్యం..

మొదటి వారం 73 శాతం రికవరీ సాధించిన ‘పెద్ది’

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus