యాంటీ అభిమానులకు క్లాస్ తీసుకున్న నాగ‌బాబు

  • December 31, 2016 / 10:36 AM IST

“గాలి వస్తుందని మనమే తలుపు తెరుస్తాం నాన్నా.. దానితో పాటే దుమ్ముకూడా వస్తుంది”.. అత్తారింటికి దారేది చిత్రంలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రాసిన అద్భుతమైన మాటల్లో ఇదిఒకటి. ప్రస్తుతం నిర్మాతలు కూడా ఆ దుమ్ముతోటే బాధపడుతున్నారు. తాము నిర్మించిన సినిమా గురించి అభిమానులకు చెప్పుకోవడానికి టీజర్, ట్రైలర్, పాటలను విడుదల చేస్తున్నారు. వాటిని చూసి నిజమైన ఫ్యాన్స్ ఆనందిస్తున్నారు. దుమ్ముల్లాంటి కొంతమంది యాంటీ ఫ్యాన్స్ వీడియో, ఆడియోలోని తప్పుల్ని వెతికి, సినిమాపై అసత్య ప్రచారం చేస్తున్నారు. సంక్రాంతికి బరిలో దిగనున్న ఖైదీ నంబర్ 150 , గౌతమి పుత్ర శాతకర్ణి సినిమాలపై కూడా ఈ ఎఫెక్ట్ పడింది. వీటిపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో బాధపడిన మెగా బ్రదర్ నాగబాబు స్పందించారు.

“వేలాది మంది కార్మికులు శ్రమఫలితం సినిమా. అటువంటి సినిమాలపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడొద్దు” అంటూ యాంటీ అభిమానులకు క్లాస్ తీసుకున్నారు. “మీ మాటల వల్ల  కోట్లు ఖర్చు పెట్టి తీసిన నిర్మాత ఏమైపోతారో.. మీరు గమనించారా? ఇప్పటికైనా నెగిటివ్ కామెంట్స్ ఆపండి” అంటూ ఆవేదనను వ్యక్తం చేశారు. “గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి కోసం క్రిష్, బాల‌య్య టీమ్ ఎంతో శ్ర‌మించింది. అలాగే అన్న‌య్య చిరంజీవి ఖైదీనంబ‌ర్ 150 కోసం ఎంతో కష్టపడ్డారు. ఈ రెండు సినిమాలు పెద్ద విజ‌యం సాధించాలి” అని ఆకాంక్షించారు. ఇక నుంచి అయిన సోషల్ మీడియాలో అవాస్తమైన వార్తల జోరుకు అడ్డుకట్ట పడాలని టాలీవుడ్ వర్గాలవారు ఆశపడుతున్నారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus