రెడీ అవుతున్న నాగచైతన్య నెక్స్ట్ సినిమా టీజర్

  • June 9, 2017 / 01:48 PM IST

కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నాగ చైతన్య నటించిన రారండోయ్ వేడుక చూద్దాం సూపర్ హిట్ అయింది. ఈ సినిమా విజయాన్ని ఆనందిస్తూనే మరో ప్రాజక్ట్ ని చైతూ పట్టాలెక్కించాడు. కృష్ణ మరిముత్తును దర్శకుడిగా పరిచయం చేస్తూ ఓ థ్రిల్లర్ మూవీ మొదలెట్టాడు. ఇందులో హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది. ఇంకా పేరు ఖరారు చేయని ఈ సినిమాలో చైతూ డ్రోన్స్ స్పెషలిస్ట్ గా కనిపించనున్నాడు. అతనికి రేవతి, రావు రమేష్ లు తల్లిదండ్రులుగా నటిస్తున్నారు. వారిని చంపిన హంతకులను డ్రోన్ ల సాయంతో కనుగొని, ఎలా ప్రతీకారం తీర్చుకుంటాడన్నదే కథ అని ఫిలిం నగర్ వాసులు చెబుతున్నారు.

సాయి కొర్రపాటి నిర్మిస్తున్న ఈ చిత్రం 30 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ నెలాఖరులో ఈ మూవీ టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్, టీజర్ కూడా రిలీజ్ చేయాలనీ నాగ చైతన్య అనుకుంటున్నారు. అందుకే ఓ వైపు షూటింగ్ చేస్తూనే మరో వైపు టీజర్ కి డైరక్టర్ కృష్ణ మరిముత్తు మెరుగులు దిద్దుతున్నారు. ఈ మూవీపై అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus