తన తండ్రి కంటే ఎక్కువ పారితోషికం తీసుకుంటున్న చైతన్య..!

  • February 11, 2020 / 08:04 PM IST

అక్కినేని నాగ చైతన్య గతేడాది ‘మజిలీ’ ‘వెంకీమామ’ వంటి రెండు సూపర్ హిట్లు అందుకుని మంచి ఫామ్లో ఉన్నాడు. దీంతో ఈయన తరువాతి సినిమా పై కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం నాగ చైతన్య … శేఖర్ కమ్ముల డైరెక్షన్లో ఓ చిత్రం చేస్తున్నాడు. ‘లవ్ స్టోరీ’ పేరుతో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రం కోసం నాగ చైతన్య తెలంగాణ స్లాంగ్ ను కూడా నేర్చుకున్నాడు. ఇక ఈ చిత్రం తర్వాత చైతూ … ‘గీత గోవిందం’ డైరెక్టర్ పరశురామ్(బుజ్జి) డైరెక్షన్లో ఓ చిత్రం చేయడానికి రెడీ అవుతున్నాడు.

ఈ చిత్రాన్ని ’14 రీల్స్ ప్లస్’ సంస్థ నిర్మిస్తుంది. ఇదిలా ఉండగా.. ఇప్పటివరకూ ఒక్కో సినిమాకి 5 నుండీ 6 కోట్ల వరకూ పారితోషికం తీసుకుంటూ వస్తున్న నాగ చైతన్య .. ఇప్పుడు దానిని 8 కోట్లకు పెంచేసాడట. ఇది తన తండ్రి నాగార్జున రెమ్యూనరేషన్ కంటే ఎక్కువ అని తెలుస్తుంది. నాగార్జున ఒక్కో చిత్రానికి 7 కోట్లు తీసుకుంటూ వస్తాడట. ఇప్పుడు చైతన్య తన తండ్రి రెమ్యునరేషన్ కూడా అధిగమించాడని తెలుస్తుంది. నాగ చైతన్య గత రెండు చిత్రాలు 35 కోట్లకు పైనే షేర్ ను వసూల్ చేసాయి. ఇక పరశురామ్ ‘గీత గోవిందం’ కూడా 65 కోట్ల పైనే షేర్ ను వసూల్ చేసింది.

Most Recommended Video

జాను సినిమా రివ్యూ & రేటింగ్!
సవారి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus