కెమెరా పట్టిన యువ సామ్రాట్!

  • August 24, 2016 / 01:36 PM IST

కెమెరా ముందు రొమాన్స్ చేయవల్సిన కింగ్ నాగార్జున తనయుడు యువ సామ్రాట్ నాగ చైతన్య కెమెరా పట్టడం ఏమిటని అనుకుంటున్నారా? అవును చైతు ఫోటో గ్రాఫర్ గా మారాడు. అయితే అతను కొత్త అవతారం ఎత్తడం వెనుక బలమైన కారణం ఉంది. కష్టాల్లో కూరుకుపోయిన వారికి చేయూతనందించడానికి అందమైన ఫోటో తీసే పనిలో పడ్డాడు. మంచు లక్ష్మి పేదలకు అండగా నిలవాలనే ఉదేశ్యంతో చేస్తున్న కార్యక్రమం “మేముసైతం”.

జెమినిలో ప్రసారమవుతున్న ఈ రియాలిటీ షోలో సెలెబ్రిటీలు పాల్గొని బాధలో ఉన్నవారి కన్నీరు తుడుస్తున్నారు. గతంలో మోహన్ బాబు, రవితేజ, నాని, కాజల్, రకుల్, యాంకర్ సుమ వంటి ఎంతో మంది సినీ తారలు పాల్గొని, సామాన్యుడిగా పనిచేసి వచ్చిన మొత్తాన్ని ఇబ్బందుల్లో ఉన్న వారికి ఇచ్చారు. అదేవిధంగా కష్టపడి ఓ నీరు పేద కుటుంబాన్ని ఆదుకోవాలని నాగ చైతన్య శ్రమించారు. కెమెరా పట్టి ఫోటోలు తీశారు. చైతు పాల్గొన్న కార్యక్రమం త్వరలో ప్రసారం కానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus