జయలలిత బయోపిక్ లో శోభన్ బాబుగా జీషు సేన్ గుప్తా!

  • February 17, 2020 / 07:43 AM IST

సినిమా విడుదలకు ముందు కనీసం ఒక్క పోస్టర్ మీద తన ఫోటో లేకపోయినా కూడా “అశ్వద్ధామ” విడుదల అనంతరం.. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ తన గురించే మాట్లాడుకునేలా చేసిన బెంగాలీ నటుడు జీషు సేన్ గుప్తా. సినిమాలో సైకోగా జీషుకి ఆడియన్స్ & క్రిటిక్స్ నుండి విశేషమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు మరో సంచలనాత్మక చిత్రంలో కీలకపాత్ర పోషించే అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు జీషు.

కంగనా రనౌత్ టైటిల్ పాత్రలో ఏ.ఎల్.విజయ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “తలైవి” చిత్రంలో శోభన్ బాబుగా జీషు నటించనున్నాడు. ఈమేరకు ఆల్రెడీ లుక్ టెస్ట్ కూడా జరిగిపోయింది. జయలలితగా కంగనా, ఎమ్జీయార్ పాత్రలో అరవిందస్వామి నటిస్తున్న ఈ చిత్రం క్యాస్ట్ లో శోభన్ బాబుగా జీషు జాయిన్ అయ్యాడు. జయలలిత బయోపిక్ గా రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇటీవలే కంగనాకు భారత ప్రభుత్వం పద్మ పురస్కారాన్ని ఇవ్వడంతో.. ఆమెకు పద్మశ్రీ వచ్చిన తర్వాత విడుదలవ్వబోయే సినిమా కాబట్టి “తలైవి” సినిమాపై అందరి చూపు ఉంది.

Most Recommended Video

వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా రివ్యూ & రేటింగ్!
పవన్ కళ్యాణ్ రీమేక్ చేసిన 11 సినిమాల
ఒక చిన్న విరామం సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus