“వేదాంతం” చెబుతున్న నాగశౌర్య!

  • April 23, 2016 / 11:33 AM IST

“జాదూగాడు, అబ్బాయితో అమ్మాయి” వంటి దిజాస్టర్ల అనంతరం ఇటీవల వచ్చిన “కళ్యాణ వైభోగమే” చిత్రంతో ఓ మోస్తరు విజయం దక్కించుకొని ఊపిరి పీల్చుకొన్న నాగశౌర్య.. పస్తుతం మెగా హీరోయిన్ నిహారిక కథానాయికగా పరిచయమవుతున్న “ఒక మనసు” చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.

“ఒక మనసు” అనంతరం “నాన్నకు ప్రేమతో” సినిమాకి కథ సమకూర్చి సడన్ స్టార్ అయిపోయిన హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వంలో ఒక చిత్రంలో నటిస్తున్నాడు. ఇప్పటికే చిత్రీకరణ మొదలైన ఈ చిత్రం కోసం “వేదాంతం” అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారట. ఈ చిత్రంలో కథానాయికగా ఎవరు నటిస్తున్నారు? ఎవరు నిర్మిస్తున్నారు ? వంటి విషయాలు తెలియాల్సి ఉంది!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags