మారుతిపై నమ్మకంతోనే శైలజా రెడ్డి అల్లుడు కథ వినలేదన్న నాగ్!

  • August 3, 2018 / 10:14 AM IST

సినీ రంగంలో అక్కినేని నాగార్జునకి ముప్పై ఏళ్ల అనుభవం ఉంది. హీరోగానే కాదు నిర్మాతగానూ అలోచించి కథని సెలక్ట్ చేస్తుంటారు. తన కోసమే కాదు ఇప్పుడు తన తనయుల కథలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి వస్తోంది. నాగచైతన్య, అఖిల్ మొదట్లో కథల ఎంపికలో తడబడడంతో రంగంలోకి దిగారు. అక్కినేని కుటుంబలో హీరోలకు మార్గదర్శకంగా ఉంటున్నారు. అతను నిర్మించిన “చి ల సౌ”‘ సినిమా ఈరోజు రిలీజ్ అయి మంచి స్పందన అందుకుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నాగార్జున మీడియా ముందుకు వచ్చారు.  “చి ల సౌ”‘ సినిమాతో పాటు నాగచైతన్య సినిమా గురించి ఆసక్తికర సంగతులు పంచుకున్నారు.

“చైతూ హీరోగా చేస్తోన్న “సవ్యసాచి” కథను నేను విన్నాను. ఆ సినిమా షూటింగ్ ఇంకా కొనసాగుతోంది. మరికొన్ని రోజుల్లో చిత్రీకరణ పూర్తవుతుంది. అప్పుడు చూస్తాను” అన్నారు. ఇక “శైలజా రెడ్డి అల్లుడు” మూవీ గురించి స్పందిస్తూ.. “ఈ చిత్ర కథను నేను వినలేదు. ఎందుకంటే మారుతి సిద్ధం చేసుకునే కథలపైనా .. ఆడియన్స్ పల్స్ పట్టుకునే ఆయన నేర్పు పైన నాకు నమ్మకం ఉంది. అందువల్లే “శైలజా రెడ్డి అల్లుడు” కథ వినలేదు. మరో పది రోజుల్లో ఆ సినిమా కూడా చూస్తాను. ఈ రెండు సినిమాలు విజయం సాధిస్తాయని నమ్మకం ఉంది” అంటూ నాగార్జున చెప్పారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus