బాహుబలి క్రియేటర్ కి దక్కిన ఏఎన్నార్ అవార్డు!

  • September 8, 2017 / 12:18 PM IST

తెలుగు ప్రజలందరూ గర్వించదగ్గ సినిమాని తెరకెక్కిన దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళికి అరుదైన గుర్తింపు దక్కింది. భారతీయ చలన చిత్ర పరిశ్రమలో విశేష సేవలందించిన వారికి ప్రదానం చేసే జాతీయ ఏఎన్నార్ అవార్డు వరించింది. ఈ విషయాన్ని నేడు అక్కినేని నాగార్జున సోషల్ మీడియా వేదికపై ప్రకటించారు. దాదా సాహెబ్ పాల్కే అవార్డు గ్రహీత అక్కినేని నాగేశ్వరరావు గౌరవార్ధం  అక్కినేని ఇంటర్నేషనల్  ఫౌండేషన్ వారు నెలకొల్పిన ఈ అవార్డును గతంలో అమితాబ్ బచ్చన్, శ్రీదేవి, హేమ మాలిని, శ్యామ్ బెనెగల్, కె.బాలచందర్ వంటి ప్రముఖులు అందుకున్నారు. 2017 సంవత్సరానికి గాను రాజమౌళి ఎంపికయ్యారు.

ఈ అవార్డుని ఈనెల 17 న శిల్పకళా వేదికలో జరగనున్న వేడుకలో జక్కన్నకి అందించనున్నారు. ఈ అవార్డుని భారత ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు చేతుల మీదుగా రాజమౌళి అందుకోనున్నారు. ఈ సందర్భంగా ఫిల్మ్ ఫోకస్ రాజమౌళికి శుభాకాంక్షలు చెబుతోంది. మరిన్ని అవార్డులు అందుకోవాలని ఆకాంక్షిస్తోంది.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus