జగన్ గా నాగార్జున..సినీరాజకీయ వర్గాలలో ఆసక్తికర చర్చ

  • September 14, 2020 / 07:03 PM IST

ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి పాత్రను కింగ్ నాగార్జున చేయనున్నారన్న వార్త టాలీవుడ్ లో పెద్ద చర్చకు దారితీసింది. కింగ్ నాగార్జున జగన్ గా వెండి తెరపై కనిపించడం ఖాయమే అని తెలుస్తుండగా ఒక్కసారిగా ప్రేక్షకులలో ఆసక్తి మొదలైంది. వివరాలోకి వెళితే ఆనందో బ్రహ్మ అనే కామెడీ హారర్ మూవీతో దర్శకుడిగా మహి రాఘవ గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ యువ దర్శకుడు గత ఏడాది దివంగత నేత వై ఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ తెరకెక్కించారు. యాత్ర అనే టైటిల్ తో తెరకెక్కిన ఈ చిత్రంలో మమ్ముట్టి వై ఎస్ ఆర్ రోల్ చేశారు. వై ఎస్ ఆర్ గా మమ్ముట్టి నటనకు ప్రసంశలు దక్కాయి.

యాత్ర మూవీలో మహి రాఘవ వై ఎస్ ఆర్ అధికారంలోకి రావడానికి పాదయాత్ర ఎలా దోహదం చేసింది, యాత్రలో ఆయన చూసిన ప్రజల కష్టాలు నుండి ప్రజాకర్షక పథకాలకు ఎలా నాంది పడింది అనే విషయాలు చూపించారు. ఈ చిత్రం ప్రేక్షకుల నుండి అద్భుత స్పందన అందుకుంది. ఈ చిత్ర విజయం ఇచ్చిన స్ఫూర్తితో మహి రాఘవ యాత్ర 2 స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నారు. ఏడాదికి పైగా ఈ స్క్రిప్ట్ పై ఆయన పనిచేస్తున్నారు. యాత్ర 2 లో వై ఎస్ ఆర్ మరణం తరువాత ఏర్పడిన రాజకీయ పరిస్థితులు, జగన్ కి ఎదురైన ఇబ్బందులు, పార్టీ స్థాపన, పాదయాత్ర, సీఎం గా గెలవడం వంటి విషయాలు చూపిస్తారట.

కాగా ఈ మూవీలో వైఎస్ జగన్ గా కింగ్ నాగార్జున నటిస్తారట. దీనిపై ఇప్పటికే చర్చలు కూడా పూర్తయ్యాయని, త్వరలోనే అధికారిక ప్రకటన ఉంటుందని సమాచారం. ప్రస్తుతం బిగ్ బాస్ హోస్ట్ గా చేస్తున్న ఆయన, వైల్డ్ డాగ్ అనే ఓ చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ తరువాత నాగ్ చేయబోయేది యాత్ర 2 అని టాలీవుడ్ టాక్.

Most Recommended Video

ఇప్పటవరకూ ఎవరు చూడని యాంకర్ లాస్య రేర్ ఫోటో గ్యాలరీ!
సినిమాకి.. సినిమాకి మధ్య ఎక్కువ గ్యాప్ తీసుకున్న టాలీవుడ్ హీరోలు వీళ్ళే?
బిగ్‌బాస్ 4 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus