స్పైడర్ కోసం రంగంలోకి దిగిన నమ్రత

  • June 17, 2017 / 07:37 AM IST

తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం అందరినీ ఊరిస్తున్న సినిమా మహేష్ స్పైడర్. మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీ నేటితో షూటింగ్ పూర్తి చేసుకోనుంది. క్రేజీ కాంబినేషన్లో ఏకకాలంలో తెలుగు, తమిళ భాషల్లో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్నీ సొంతం చేసుకోవడానికి డిస్ట్రిబ్యూటర్లు పోటీపడుతున్నారు. 25 కోట్లు చెల్లించి నైజాం ఏరియా థియేటర్స్ రైట్స్ ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు దక్కించుకున్నారు.  అలాగే సీడెడ్ లో 15 కోట్లకు అమ్ముడు పోయిందంట. తమిళనాడు థియేటర్స్ రైట్స్ కూడా 20 కోట్లు పలికింది. ఇంకా ఆంధ్ర ప్రాంతంలో హక్కులకోసం సంప్రదింపులు జరుగుతున్నాయి. అయితే ఈ చిత్రాన్ని హిందీలో భారీ రిలీజ్ చేయాలనీ మహేష్ భార్య నమ్రత శిరోత్కర్ భావిస్తోంది. అందుకే రంగంలోకి దిగింది.

స్పైడర్ హిందీ హక్కులను పెద్ద మొత్తానికి విక్రయించడంతో పాటు భారీ ఎత్తున ప్రచారం నిర్వహించే బాధ్యతను తీసుకున్నట్లు తెలిసింది. బాలీవుడ్ లో ఆమెకున్న పరిచయాన్ని స్పైడర్ మూవీ కోసం వినియోగించుకోబోతోంది. ఈ చిత్రంతో మహేష్ బాబు కి బాలీవుడ్ లోను క్రేజ్ తీసుకురావాలని ప్రయత్నిస్తోంది. ఠాగూర్ మధు సమర్పణలో ఎన్.వి.ఆర్. సినిమా, ఎల్ఎల్పి, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ పతాకాలపై ఎన్.వి.ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం ట్రైలర్ ఆగస్టు 9 న రిలీజ్ కాబోతుండగా, సినిమా సెప్టెంబర్ 27 న థియేటర్లోకి రానుంది.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus