Nani: ‘సరిపోదా శనివారం’ సీక్వెల్ పై నాని ఏమన్నాడంటే..!

  • August 28, 2024 / 10:41 AM IST

నేచురల్ స్టార్ నాని (Nani)  హీరోగా ప్రియాంక అరుళ్ మోహన్ (Priyanka Mohan)   హీరోయిన్ గా ‘నానీస్ గ్యాంగ్ లీడర్’ (Nani’s Gang Leader) తర్వాత రూపొందిన చిత్రం ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram) . వివేక్ ఆత్రేయ (Vivek Athreya)  దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ఇది. గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన ‘అంటే సుందరానికీ!’ (Ante Sundaraniki) పర్వాలేదు అనిపించినా బాక్సాఫీస్ వద్ద అది పెద్దగా నిలబడలేదు. అయినప్పటికీ ఆ సినిమాకి కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారని చెప్పొచ్చు. ఇప్పటికీ ‘అంటే సుందరానికీ’ అంటే ఓటీటీలో చూసే ప్రేక్షకులు ఉన్నారు.

Nani

అయితే అది పక్కా క్లాస్ మూవీ. ఈసారి నాని- వివేక్ ఆత్రేయ కలిసి ఓ స్ట్రాంగ్ హిట్ కొట్టాలనే ఉద్దేశంతో ‘సరిపోదా శనివారం’ చేసారని చెప్పుకోవచ్చు. ఆగస్టు 29 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎస్.జె.సూర్య (SJ Suryah)  ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు. నాని, ఎస్.జె.సూర్య..ల కాంబోలో వచ్చే సీన్స్ ప్రేక్షకుల్ని మెప్పించే విధంగా ఉంటాయని అంతా అంటున్నారు.

ప్రతి శనివారం ‘హీరో బాషా లాగా రెచ్చిపోతాడని మిగిలిన రోజుల్లో మాణిక్యంలా ఉంటాడని’ కూడా నాని చెప్పడం జరిగింది. ఇలాంటివన్నీ మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకునే అంశాలే. అలాగే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా ఉన్నట్టు ఇన్సైడ్ టాక్. అవి ప్రస్తుతానికి టీం దాచి ఉంచుతుంది.

మరోపక్క ఈ చిత్రానికి ‘సీక్వెల్ ఉంటుందా?’ అని నానిని ప్రశ్నించగా… ” లాస్ట్ సీన్ ను బట్టి సీక్వెల్ ఉండాలి. అయితే ముందు ప్రేక్షకులు ఈ సినిమాని మెచ్చి సూపర్ హిట్ గా నిలబెడితే అది సాధ్యమవుతుంది” అంటూ క్లారిటీ ఇచ్చాడు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus