Manchu Lakshmi: బ్యాండేజ్లతో మంచు లక్ష్మీ.. షాకిస్తున్న ఫోటో.!

  • August 26, 2024 / 09:14 PM IST

కలెక్షన్ కింగ్, డైలాగ్ కింగ్ అయినటువంటి మోహన్ బాబు (Mohan Babu) కుమార్తె మంచు లక్ష్మీ ప్రసన్న (Manchu Lakshmi) అందరికీ సుపరిచితమే. పలు టీవీ షోలతో కెరీర్ ప్రారంభించిన ఈమె ఆ తర్వాత పలు సినిమాలు నిర్మించింది. అటు తర్వాత నటిగా కూడా మారి సినిమాలు చేస్తుంది. అన్నిటికీ మించి సోషల్ మీడియాలో లక్ష్మీ మంచు పెద్ద స్టార్. ఆమె ఏం మాట్లాడినా సెన్సేషనే, ఏం పోస్ట్ చేసినా సెన్సేషనే..! అందుకే ఆమె ఫాలోయింగ్ కూడా ఆ రేంజ్లో ఉంటుంది.

Manchu Lakshmi

ఇదిలా ఉండగా.. కొద్దిరోజులుగా మంచు లక్ష్మీ గ్లామర్ ఫోటో షూట్లు చేస్తూ వచ్చింది. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఇట్టే వైరల్ అయిపోయేవి. అయితే ఇప్పుడు మొహం పై బ్యాండేజ్..లు ఉన్న ఓ ఫోటోని షేర్ చేసి పెద్ద షాకిచ్చింది. విషయం ఏంటంటే.. లక్ష్మీ మంచు మొహం పై బ్యాండేజ్లు ఉన్నాయి. ముఖ్యంగా ఆమె మూతి వాచిపోయినట్టు ఉంది. దీంతో ఆమె ఫాలోవర్స్ షాక్ కి గురయ్యారు.

విషయం ఏంటంటే.. ఇటీవల లక్ష్మీ మంచు అమెరికా వెళ్ళిన టైంలో జ్వరంగా అనిపించడంతో ఓ జ్వరం టాబ్లెట్ వేసుకుందట. అది వికటించడంతో ఆమె పెదవులు ఉబ్బిపోయాయి అని తెలుస్తుంది. ఇక కింది పెదవి చర్మం మొత్తం రాష్ వచ్చినట్లు తెలుస్తుంది. సాధారణంగా.. కొన్ని మెడిసిన్స్ అందరికీ పడవు. అలాంటప్పుడు ఇలాంటి వింత అనుభవాలు ఎదురవుతాయి. అది తెలపడం కోసమే ఈ ఫోటోని షేర్ చేసినట్లు లక్ష్మీ మంచు తెలిపింది.

బన్నీకే ఎందుకిలా.. ప్రతి సినిమా రిలీజ్ సమయంలో ఇబ్బందులే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus