ఇద్దరి మెగా హీరోలకు పోటీగా త్రిష!

  • March 21, 2016 / 07:55 AM IST

తెలుగులో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా చెలామణి అయిన నటి త్రిష ఆ తరువాత చెన్నైకి తన మాకాంను మార్చింది. బాడీగార్డ్, దమ్ము సినిమాల రిలీజ్ తరువాత చాలా కాలం గ్యాప్ తీసుకొని తను నటిస్తోన్న స్ట్రెయిట్ తెలుగు సినిమా ‘నాయకి’ను విడుదలకు సిద్ధం చేసింది.

అయితే ఇదే నెలలో పవన్ నటించిన ‘సర్దార్’ సినిమా, బన్నీ నటిస్తోన్న ‘సరైనోడు’ చిత్రాలు విడుదలకు రెడీగా ఉన్నాయి. సర్దార్ ‘ఏప్రిల్’ 8న వస్తుండగా, ఏప్రిల్ 22న ‘సరైనోడు’ సినిమా రిలీజ్ అవుతోంది. ఈ రెండు చిత్రాల మధ్య త్రిష నటించిన ‘నాయకి’ కూడా రిలీజ్ అవుతోంది. ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమాలో తొలిసారి పూర్తి స్థాయిలో నటించిన త్రిష ఈ సినిమాపై చాలా నమ్మకంగా ఉంది. హారర్ జోనర్‌లో రానున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. మరి ఈ మెగా హీరోల మధ్య త్రిష నిలుస్తుందో.. లేదో.. చూడాలి..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus