తనపై వచ్చిన వార్తలను ఖండించిన నయనతార

  • June 22, 2018 / 11:00 AM IST

రియల్ లైఫ్ లోని సంఘటనలు రీల్ లైఫ్ పైనా కచ్చితంగా ప్రభావం చూపుతాయి. వ్యక్తిగత కారణాల వల్ల వృత్తికి దూరమైనవారు ఎంతోమంది ఉన్నారు. నయనతార కూడా పెర్సనల్ ప్రాబ్లమ్స్ తో చాలా కుంగిపోయారు. ఆ ప్రొబ్లెమ్స్ నయన ప్రొఫిషనల్ లైఫ్ ని మరింత స్ట్రాంగ్ చేసింది. దక్షిణాది సినిమా పరిశ్రమల్లో టాప్ హీరోయిన్ గా ఎదిగేలా చేసింది. ఓ వైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో మంచి పేరు తెచ్చుకుంటూ.. స్టార్ హీరో సినిమాల్లో హీరోయిన్ గా అవకాశాలు దక్కించుకుంటోంది. ఇప్పుడు సైరా నరసింహా రెడ్డి లో మెగా స్టార్ చిరంజీవి పక్కన నటిస్తోంది. ఈ చిత్ర షూటింగ్ లో బిజీగా ఉన్న ఆమెకు రెండు రోజులుగా ఓ న్యూస్ నిద్ర లేకుండా చేస్తోంది.

అదే తన ప్రియుడు విఘ్నేష్ శివన్ సినిమాల్లేక ఖాళీగా ఉన్నారని, అందుకే తాను నిర్మాతగా మారి సినిమా నిర్మిస్తున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు షికారు చేస్తున్నాయి. దీనిపై నేడు నయనతార స్పందించింది. ప్రస్తుతం విఘ్నేష్ రూపొందిస్తున్న “ఇదయం మురళీ” సినిమాకు తాను నిర్మాతని కానని స్పష్టం చేసింది. “నేను నిర్మాతగా మారానన్నది పూర్తిగా అబద్ధం. ఆ వార్తలను నమ్మకండి. నేను ప్రస్తుతం నటనపైనే పూర్తి దృష్టి పెట్టాను” అని నయనతార వెల్లడించింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus