సైరా సెకండ్ షెడ్యూల్లో పాల్గొననున్న నయనతార

  • December 30, 2017 / 09:12 AM IST

తొలి భారతీయ స్వాతంత్ర సమర యోధుడు రేనాటి సూర్యుడు ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి జీవితం ఆధారంగా రూపుదిద్దుకుంటున్న ‘సైరా నరసింహారెడ్డి’ షూటింగ్ హైదరాబాద్ లోని నానక్ రామ్ గూడా స్టూడియోస్ లో గత కొన్ని రోజులుగా జరుగుతోంది. ఖైదీ నంబర్ 150 ఇచ్చిన విజయంతో మరింత ఉత్సాహంగా చిరంజీవి ఈ సినిమాని చేస్తున్నారు. కొన్ని కీలకమైన యాక్షన్ సన్నివేశాలు కంప్లీట్ అయినట్లు సమాచారం. అభిమానుల అంచనాలకు మించి ఉండేలా ఈ చిత్రాన్ని డైరక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్నట్టు సమాచారం.

రెండో షెడ్యూల్ త్వరలో మొదలుకానుంది. ఇందుకోసం నయనతార డేట్స్ సరిగ్గా ఇవ్వడం లేదని, అసలు అటు నుంచి ఎటువంటి స్పందన లేదని, చిరు బృందం కోపంగా ఉన్నట్లు గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు విహారం చేశాయి. ఆ వార్తల్లో నిజం లేదని తెలిసింది. ఫిబ్రవరి నుంచి సైరా టీమ్ లో నయన కలవనున్నట్లు చిత్ర బృందం తెలిపింది. అప్పుడే సెకండ్ షెడ్యూల్ ప్రారంభిస్తామని వెల్లడించింది. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ లో రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సినిమా రారాజు అమితాబ్ బచ్చన్, డేరింగ్ స్టార్ జగపతి బాబు, కన్నడ స్టార్ కిచ్చ సుదీప్, విజయ్ సేతు పతి లు కీలక పాత్రలు పోషించనున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus