ప్రియుడి కోసం నిర్మాతగా మారిన స్టార్ హీరోయిన్

  • June 20, 2018 / 11:57 AM IST

మూడేళ్ళ క్రితం వచ్చిన “నానుమ్ రౌడీదాన్” సినిమా నయనతారకి మంచి పేరు తెచ్చి పెట్టింది. అలాగే మంచి స్నేహితుడిని పరిచయం చేసింది. సినిమా రిలీజ్ అయినప్పుడు స్నేహితుల్లా ఉన్న ఈ చిత్ర డైరక్టర్ విఘ్నేశ్ శివన్‌, హీరోయిన్ నయన తార .. సినిమా హిట్ అయిన తర్వాత లవర్స్ గా మారిపోయారు. ఆ లవర్స్ ఒకరు విడిచి మరొకరు ఉండలేకపోవడానికి ఎక్కువకాలం పట్టలేదు. ఇద్దరూ కలిసి పెళ్లికాకముందే కాపురం పెట్టారని కోలీవుడ్ వర్గాలు కోడై కూసినప్పటికీ వారు కొంచెం కూడా పట్టించుకోలేదు. చెట్టాపట్టాలేసుకొని ఎంజాయ్ చేస్తున్నారు. నయన తెలుగు, తమిళ సినిమాలతో బిజీగా ఉంది. విఘ్నేశ్ శివన్‌ ఖాళీగా ఉన్నాడు.

ఈ మధ్య కాలంలో అతను డైరక్ట్ చేసిన తానా సెరంద కూట్టం (గ్యాంగ్) ఒకటే రిలీజ్ అయింది. ఇది పెద్ద హిట్ కాలేకపోయింది. దీంతో విఘ్నేశ్ చేతికి అవకాశాలు రాలేదు. అందుకే పనిలేక ఇంట్లోనే ఉన్నాడు. ఇది గమనించిన నయన తార ప్రియుడి కోసం నిర్మాతగా మారింది. విఘ్నేశ్ సిద్ధం చేసిన లేడీ ఓరియెంటెడ్ కథలో నటించి, స్వయంగా నిర్మించడానికి పూనుకుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా త్వరలోనే మొదలుకానుంది. యువ హీరో ఆత్రవ ఇందులో హీరోగా కనిపించబోతున్నాడు. ఈ సినిమాతో విఘ్నేశ్ హిట్ ట్రాక్ లోకి వచ్చి బిజీ అవుతారని నయన తార ఆశపడుతోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus