పూరి తనయుడితో రొమాన్స్ చేయనున్న బెంగుళూర్ బ్యూటీ!

  • September 25, 2017 / 07:51 AM IST

డేరింగ్ డైరక్టర్ పూరీ జగన్నాథ్‌ తన తనయుడు ఆకాశ్‌ ని హీరోగా రీ లాంచ్ చేయడానికి కష్టపడుతున్నారు. బాలనటుడిగా అనేక సినిమాలను చేసిన ఆకాష్, ఆంద్ర పోరి ద్వారా హీరోగా అడుగుపెట్టారు. అయితే ఆ చిత్రం ఆకాష్ కి బ్రేక్ ఇవ్వలేకపోయింది. సో కొడుకుని హీరోగా నిలబెట్టాలని పూరి జగన్నాథ్ భావిస్తున్నారు. బాలకృష్ణ తో పైసా వసూల్ తర్వాత ఆకాష్ కోసం స్క్రిప్ట్ పనిలో పడ్డారు. మంచి లవ్ స్టోరీ కంప్లీట్ చేయడమే కాదు అందుకు అవసరమైన నటీనటుల ఎంపిక మొదలు పెట్టినట్లు తెలిసింది. టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంతోమంది అందమైన భామలను పరిచయం చేసిన పూరి.. తన తనయుడి చిత్రం ద్వారా మరో బ్యూటీని పరిచయం చేయబోతున్నారు.

బెంగళూరుకి చెందిన నేహాశెట్టిని ఎంపిక చేసినట్లు సమాచారం. పూరి జగన్నాథ్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ మూవీ విశేషాలు త్వరలో అధికారికంగా వెల్లడించనున్నారు. ఇడియట్ రేంజ్ లో ఈ సినిమా ఉండబోతోందని ఫిలిం నగర్ వాసులు చెప్పుకుంటున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus