విడుదలకు ఒక్కరోజు ముందు మహర్షి నిర్మాతలకు టెన్షన్

Advertisement

మరికొన్ని గంటల్లో “మహర్షి” ప్రేక్షకులను పలకరించనున్నాడు. చిత్ర నిర్మాతలు, దర్శకుడు, కథానాయకుడు సినిమా రిజల్ట్ మీద కాన్ఫిడెంట్ గా ఉండగా.. ఫ్యాన్స్ ఏమో ఎప్పుడెప్పుడు ఈ సినిమాను థియేటర్లలో చూస్తామా అని చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నారు. ముఖ్యంగా.. ఇది మహేష్ బాబు 25వ సినిమా కావడంతో ఆయనకు మరియు ఆయన అభిమానులకు ఇది చాలా ప్రతిష్టాత్మక చిత్రం. దాంతో అందరూ రేపటి కోసం చాలా ఆతృతగా వెయిట్ చేస్తుండగా.. ఈలోపు ఊహించనివిధంగా దిల్ రాజు ఆఫీస్ పై ఐ.టి దాడులు జరిగాయి.

భారీ చిత్రాల విడుదలకు ఒకట్రెండు రోజుల ముందు ప్రొడ్యూసర్స్ మరియు ప్రొడక్షన్ ఆఫీస్ లపై ఐ.టి దాడులు జరగడం అనేది సర్వసాధారణమే అయినప్పటికీ.. “మహర్షి” నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజు ఆఫీస్ లో ఐ.టి దాడి జరగడం వెనుక మాత్రం ఒక వింత రీజన్ ఉంది. అదేంటంటే.. దాదాపు 100 కోట్ల రూపాయల బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం ప్రీరిలీజ్ బిజినెస్ 140 కోట్లు చేసిందని టాక్ స్ప్రెడ్ అయ్యింది. ఆ టాక్ ఐ.టి టాస్క్ దాకా వెళ్లింది. దాంతో వెంటనే దిల్ రాజు ఆఫీస్ పై దాడి చేశారు. కొద్దిసేపట్లో ముగియనున్న ఈ దాడితో దిల్ రాజు & టీం బాగా డిస్టర్బ్ అయ్యారు. ఈ డిస్టర్బెన్స్ మొత్తం రేపు సినిమా విడుదలయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకొన్న తర్వాత పోతుంది లెండి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus