నిఖిల్ సూపర్ హిట్ సినిమా సీక్వెల్ సిద్ధం!

  • October 25, 2017 / 10:03 AM IST

ప్రస్తుతం కన్నడ సూపర్ హిట్ సినిమా “కిరిక్ పార్టీ”ని తెలుగులో రీమేక్ చేస్తున్న నిఖిల్ ఆ సినిమా అనంతరం తన ఫేవరెట్ డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వంలో ఒక సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ప్రస్తుతం నాగచైతన్య హీరోగా ‘సవ్యసాచి” చిత్రాన్ని తెరకెక్కిస్తున్న చందు మొండేటి ఆ సినిమా పూర్తవ్వగానే నిఖిల్ హీరోగా తాను తెరకెక్కించే సినిమా స్క్రిప్ట్ వర్క్ మొదలెట్టానున్నాడు. ఈ సినిమా “కార్తికేయ”కు సీక్వెల్ అని తెలుస్తోంది. నిన్న “కార్తికేయ” విడుదలై మూడేళ్లవుతున్న సందర్భంగా “కార్తికేయ 2” స్క్రిప్ట్ లోడింగ్ లో ఉందని.. త్వరలోనే ప్రొజెక్ట్ డీటెయిల్స్ ఎనౌన్స్ చేస్తానని నిఖిల్ ట్విట్టర్ లో ప్రకటించాడు.

ఈ క్రేజీ ప్రొజెక్ట్ ను నిర్మించేందుకు చాలా మంది నిర్మాతలు ముందుకొచ్చినప్పటికీ.. దిల్ రాజు ఆ బంపర్ ఆఫర్ ను సొంతం చేసుకొన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నాని, రాజ్ తరుణ్ లతో సినిమాలు తీస్తున్న దిల్ రాజు ఇప్పుడు నిఖిల్ సినిమాకి కూడా ప్రొడ్యూసర్ గా వ్యవహరించనుండడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగే అవకాశాలున్నాయి. 2018 మార్చి లేదా ఏప్రిల్ లో సినిమా సెట్స్ కు వెళ్ళే అవకాశం ఉంది.

ఇకపోతే.. నిఖిల్ ప్రస్తుతం “కిరిక్ పార్టీ” రీమేక్ కోసం బాగా కండలు పెంచేశాడు. మళ్ళీ “కార్తికేయ 2” కోసం ఆ కండలను కరిగించి మళ్ళీ స్లిమ్ లుక్ లోకి రావడం కోసం ఇప్పట్నుంచే కసరత్తులు మొదలెట్టాడంట.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus