ఎక్కడికి పోతావు నితిన్ అంటున్న నందిత

  • February 7, 2018 / 07:58 AM IST

ప్రస్తుతం తన 25వ చిత్రం ఆఖరి షెడ్యూల్ లో యమ బిజీగా ఉన్న నితిన్ తన తదుపరి చిత్రంగా ‘శతమానం భవతి’ ఫేమ్ సతీష్ వేగేశ్న దర్శకత్వంలో “శ్రీనివాస కళ్యాణం” చిత్రాన్ని సైన్ చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఏప్రిల్ నుంచి సెట్స్ కు వెళ్లనుంది. దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న ఈ చిత్రం నితిన్ సరసన కథానాయికగా నటించే లక్కీ భామను ఫైనల్ చేశారు. నిఖిల్ “ఎక్కడికి పోతావు చిన్నవాడా” చిత్రంతో నటనతో, అందంతో ఆకట్టుకొన్న నందిత శ్వేత ఈ చిత్రంలో కథానాయికగా ఎంపికైంది. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేసేందుకు నిర్మాత దిల్ రాజు సన్నాహాలు చేస్తున్నారు.

ఇకపోతే.. నితిన్ 25వ చిత్రమైన “అక్కడ అమ్మాయి, ఇక్కడ అబ్బాయి” (వర్కింగ్ టైటిల్) ఫస్ట్ లుక్ ఫిబ్రవరి 12న, టీజర్ ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు కానుకగా విడుదల చేయనున్నారు. నితిన్ సరసన మేఘా ఆకాష్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి లిరిక్ రైటర్ టర్నడ్ కృష్ణచైతన్య దర్శకుడు. త్రివిక్రమ్-సుధాకర్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని పవన్ కళ్యాణ్ సమర్పణలో రూపొందుతుండడం విశేషం. అసలే చాలా ఆశలు పెట్టుకొన్న “లై” సరిగా ఆడకపోవడంతో భవిష్యత్ చిత్రాలపై చాలా ఆశలు పెట్టుకొన్నాడు నితిన్.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus