అడిగితే ఇచ్చేవాడిని కథా.. ఇలా లేపెయ్యలా?

  • July 12, 2019 / 05:06 PM IST

సందీప్ కిషన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘నిను వీడని నీడను నేనే’. కార్తీక్ రాజు డైరెక్ట్ చేసిన ఈ చిత్రం ఈరోజు విడుదలైంది. కాన్సెప్ట్ కొత్తగా ఉందని.. హీరో సందీప్ కిషన్ చాన్నాళ్ళ తరువాత హిట్టు కొట్టాడని ప్రేక్షకులు ఈ చిత్రం పై ప్రశంసలు కురిపిస్తున్నారు. మొత్తానికి పాజిటివ్ టాక్ అయితే ఈ చిత్రానికి వచ్చింది. ‘వేంకటాద్రి టాకీస్’ ‘వి స్టూడియోస్’ బ్యానర్ల పై రూపొందిన ఈ చిత్రానికి హీరో సందీప్ కిషన్ కూడా సహా నిర్మాతగా కూడా వ్యవహరించాడు. సినిమా కి పాజిటివ్ టాక్ వచ్చింది అని అందరూ అనుకునే లోపే ఈ కథ నాదే అంటూ ఓ వ్యక్తి ఆరోపణలు వ్యక్తం చేయడం సంచలనంగా మారింది.

వివరాల్లోకి వెళితే.. సుశాంత్ రెడ్డి అనే వ్యక్తి.. ‘ఈ చిత్రం కథ నా షార్ట్ ఫిలిం నుండీ లేపేశారు’ అంటూ ఆరోపణలు వ్యక్తం చేసాడు. అంతే కాదు.. ‘అడిగితే ఇచ్చేవాడిని కదా ‘బ్రో’ .. కాపీ కొట్టి ఇంత బ్యాడ్ గా ఎగ్జిక్యూట్ చేయాలా? అంటూ ప్రశ్నించాడు. ‘సినిమా మేకర్స్ కూడా నీతిగా ఉండాలి కదా’ అంటూ తన ఆవేదన వ్యక్తం చేసాడు సుశాంత్ రెడ్డి. ‘నిను వీడని నీడను నేనే’ షార్ట్ ఫిలిం ను నేను 2017 లోనే తీసాను అంటూ ఆ షార్ట్ ఫిలిం లింక్ ను కూడా షేర్ చేసాడు. మరి ఈ విషయం పై హీరో సందీప్ కిషన్ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus