మను సినిమాని ప్రకటించిన నిర్వాణ సినిమాస్

  • July 6, 2018 / 07:34 AM IST

మధురం అనే షార్ట్ ఫిలిం తో నెటిజనులు ఆకట్టుకున్న ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న సినిమా మను. క్రౌడ్ ఫండింగ్ తో తెరకెక్కుతున్న సినిమాలో బ్రహ్మానందం తనయుడు గౌతమ్‌ హీరోగా నటిస్తున్నారు. పల్లకిలో పెళ్లి కూతురు’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన గౌతమ్‌, ‘బసంతి’తో మంచి పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు ‘మను’ చిత్రంలో విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నారు. హీరోయిన్ గా చాందిని చౌదరి నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుపుకుంటోంది.

ఎక్స్పెరిమెంటల్ డ్రామా జానర్ లో వస్తున్న ఈ మూవీ ఫస్ట్ లుక్, టీజర్ కి విశేష స్పందన వచ్చింది. ఈ రెస్పాన్స్ చూసి అమెరికాలో ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ అయిన నిర్వాణ సినిమాస్ వారు ఈ చిత్రాన్ని సమర్పించడానికి ముందుకువచ్చారు. ఈ విషయాన్నీ అధికారికంగా వారు ప్రకటించారు. “ఈక్షణం కోసం ఎన్నోరోజులుగా ఎదురుచూస్తున్నాం. ఎమోషనల్ గా కనెక్ట్ ఆయిన్ సినిమా మను. మా సంస్థ నుంచి వస్తున్న సెకండ్ ప్రాజక్ట్ ఇది” అని వెల్లడించారు. దీంతో ఫణీంద్ర నర్సెట్టి బృందం ఆనందం వ్యక్తం చేసింది. కొత్త విప్లవానికి నాంది పలుకుతున్న ఈ చిత్రం ట్రైలర్ త్వరలోనే రిలీజ్ కానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus