థియేటర్లో ‘నిశ్శబ్దం’ షో పడింది!

  • October 2, 2020 / 02:35 PM IST

అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో గురువారం రాత్రి నుండి ‘నిశ్శబ్దం’ సినిమా ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది. సినీ ప్రేమికులు, అనుష్క అభిమానులు ఇళ్లల్లో కూర్చొని టీవీలు, కంప్యూటర్లు, ల్యాప్ టాప్స్ లో సినిమా చూశారు. కొంతమంది ప్రముఖులు మాత్రం ఈ సినిమాను థియేటర్లలో చూశారు. ‘నిశ్శబ్దం’ యూనిట్ లో హైదరాబాద్ సిటీలో ఉన్న ముఖ్యమైన సభ్యులు కొందరు, మరి కతమంది సినిమా ప్రముఖులు కలిసి గురువారం రాత్రి సినిమా థియేటర్లో చూశారు.

వారి కోసం ప్రొడ్యూసర్ స్పెషల్ షో అరేంజ్ చేసారు. ఫిలిం నగర్ లో గల ప్రముఖ స్టూడియోలో ఉన్న ప్రివ్యూ థియేటర్ షో పడినట్లు సమాచారం. సినిమా విడుదలైన కొన్ని గంటల్లో సోషల్ మీడియాలో టాక్ స్ప్రెడ్ అయ్యింది. పాజిటివ్ టాక్ రాకపోవడం గమనించదగ్గ అంశం. ఆల్రెడీ పైరసీ ప్రింట్లు ఇల్లీగల్ సైట్స్ లో వచ్చాయి. దీనివల్ల సినిమాపై ఎంతో ప్రభావం పడుతుందో చూడాలి.

Click Here For Nishabdham Movie Review

Most Recommended Video

బిగ్‌బాస్‌లో రోజూ వినే గొంతు… ఈయనదే!
రజినీ టు ఎన్టీఆర్.. జపాన్ లో కూడా అదరకొట్టిన హీరోలు వీళ్ళే..!
కోలీవుడ్లో ఎక్కువ పారితోషికం తీసుకునే హీరోలు వీళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus