Nithya Menen: ఒక శకం ముగిసింది.. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను: నిత్యమీనన్

  • July 16, 2023 / 04:40 PM IST

సినీనటిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని సౌత్ ఇండస్ట్రీలో వరుస అవకాశాలతో ఎంతో బిజీగా గడుపుతున్నటువంటి నిత్యామీనన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే నిత్యామీనన్ ఇంట్లో తాజాగా తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే ఈ విషయాన్ని స్వయంగా నిత్య మీనన్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారింది. నిత్యామీనన్ అమ్మమ్మ చనిపోయారు అనే విషయాన్ని ఈమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.

ఈ క్రమంలోనే తన అమ్మమ్మ తాతయ్య గారితో కలిసి దిగిన ఫోటోని నిత్యమీనన్ షేర్ చేస్తూ… ఒక శకం ముగిసింది మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను. గుడ్ బాయ్ అమ్మమ్మ అండ్ మై చెర్రీ మ్యాన్.ఇప్పటినుంచి మిమ్మల్ని మరో కోణంలో చూసుకుంటా అంటూ ఈమె ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఈ విధంగా తన అమ్మమ్మ చనిపోయారు అనే విషయాన్ని ఈమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఎమోషనల్ కావడంతో ఎంతోమంది అభిమానులు తనకు ధైర్యంగా ఉండాలని కామెంట్స్ చేస్తున్నారు.

నిత్యామీనన్ (Nithya Menen) సినీకెరియర్ విషయానికి వస్తే ఈమె మలయాళీ అయినప్పటికీ తెలుగులో కూడా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ఇక్కడ కూడా ఆదే స్థాయిలో ఆదరణ పొందారు. ఇక తెలుగు చిత్ర పరిశ్రమకు అలా మొదలైంది సినిమా ద్వారా హీరోయిన్గా పరిచయమయ్యారు. ఇక ఈమె తెలుగులో నటించిన ఇష్క్, గుండెజారి గల్లంతయింది, జనతా గ్యారేజ్,భీమ్లా నాయక్ వంటి సినిమాలు ఎంతో మంచి సక్సెస్ అందుకున్నాయి.

ఇక చివరిగా తెలుగులో ఈమె పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన భీమ్లా నాయక్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈమె సినిమాలు మాత్రమే కాకుండా వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నారు.

బేబీ సినిమా రివ్యూ & రేటింగ్!

హాస్టల్ డేస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
మహావీరుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus