బాలీవుడ్ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిన నిత్యా

  • November 6, 2018 / 08:30 PM IST

“అలా మొదలైంది”తో తెలుగు తెరకు పరిచయమైన మలయాళ ముద్దుగుమ్మ నిత్యామీనన్ తెలుగులో స్టార్ హీరోయిన్ గా ఎదిగినప్పటికీ.. హైట్ కారణంగా కొన్ని సినిమాలు వాదులుకోవాల్సి వస్తే, ఇప్పుడు అధిక బరువు కారణంగా ఇంకొన్ని సినిమాలు పోగొట్టుకోవాల్సి వచ్చింది. తెలుగు, తమిళం, మలయాళంలో పలు చిత్రాల్లో నటించి మెప్పించిన‌ నిత్యమీనన్ ఇపుడు బాలీవుడ్‌లో అడుగుపెడుతున్న‌ది. బాలీవుడ్ లో రూపొందుతున్న “మిష‌న్ మంగ‌ల్” మూవీలో ఆమెను ఒక హీరోయిన్ గా తీసుకున్నారు.. అక్ష‌య్ కుమార్ ఈ మూవీలో హీరో. ఇందులో విద్యాబాల‌న్, సోనాక్షి సిన్హా, తాప్సీలు కూడా న‌టిస్తున్నారు..ఈ మూవీకి జ‌గ‌న్ శ‌క్తి ద‌ర్శ‌కుడు. ఫాక్స్ స్టార్ స్టూడియోతో క‌లసి అక్ష‌య్ ఈ మూవీని స్వ‌యంగా నిర్మిస్తున్నాడు.

ఇకపోతే.. నిత్యామీనన్ నటిస్తూ నిర్మిస్తున్న “ప్రాణ” కూడా వచ్చే నెలలో విడుదలకానుంది. ఎక్స్ పెరిమెంటల్ & ఎమోషన్ ఫిలిమ్ అయిన ఈ చిత్రంపై నిత్యా చాలా ఆశలు పెట్టుకొంది. అందుకే భారీగా ప్రమోట్ చేస్తుంది. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తోంది నిత్యా.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus