మొత్తానికి నితిన్ ని.. త్రివిక్రమ్ ఒప్పించేసాడు..!

  • February 9, 2019 / 07:19 AM IST

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ … నితిన్ తో రాయబారాలు నడుపుతున్నాడట. అదేంటి..! త్రివిక్రమ్ లాంటి స్టార్ డైరెక్టర్ నితిన్ తో రాయబారాలు నడపడమేంటి అనేగా మీ డౌట్..! నితిన్ హీరోగా ‘ఛలో’ ఫేం వెంకీ కుడుముల డైరెక్షన్లో ‘భీష్మ’ అనే చిత్రాన్ని చేయబోతున్నట్టు గత కొంత కాలంగా వార్తలు వస్తున్నాయి. త్రివిక్రమ్ కి అత్యంత సన్నిహిత్యం ఉన్న నాగవంశీ.. ‘సితారా ఎంటర్టైన్మెంట్స్’ సంస్థ అధినేత ఈ చిత్రాన్ని నిర్మించబోతుండడంతో త్రివిక్రమ్ ఎంట్రీ ఇచ్చాడు.

అసలు విషయంలోకి వెళితే ‘భీష్మ’ చిత్రం ఎప్పుడో మొదలు కావాల్సి ఉంది. అయితే ఇంకా ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్ళలేదు. దీనికి ముఖ్య కారణం ఏంటని ఆరా తీయగా.. నితిన్ రెమ్యునరేషన్ దగ్గర రాజీ పడటం లేదని స్పష్టమవుతుంది. ‘లై’, ‘ఛల్ మోహన రంగ’, ‘శ్రీనివాసకళ్యాణం’ వంటి వరుస డిజాస్టర్లతో నితిన్ మార్కెట్ కొంచెం దెబ్బతిన్న నేపథ్యంలో…’భీష్మ’ నిర్మాణ సంస్థ నితిన్ ని రెమ్యునరేషన్ తగ్గించుకోవాలని కోరారట. కానీ నితిన్ మాత్రం ‘లై’ సినిమాకు ముందు ఈ బ్యానర్ లో సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు కాబట్టి .. అప్పుడు అనుకున్న రెమ్యునరేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాడట. దీంతో త్రివిక్రమ్ సీన్లోకి ఎంటర్ అయ్యి నితిన్ ని ఒప్పించే పనిలో ఉన్నాడట. ‘అఆ’ ‘చల్ మోహన్ రంగ’ వంటి చిత్రాలతో నితిన్ – త్రివిక్రమ్ లకి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది.

అందులోనూ పవన్ కళ్యాణ్ తో వీరిద్దరికీ ఉన్న అనుబంధం కారణంగా నిర్మాత త్రివిక్రమ్ ని… పెద్దమనిషిగా నియమించుకున్నట్టు తెలుస్తుంది. మరోపక్క ఈ చిత్ర షూటింగ్ కోసం కాల్షీట్స్ కేటాయించిన హీరోయిన్ రష్మిక.. కూడా ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవాలని భావిస్తోందట. ఈ నేపథ్యంలో ఈ చిత్ర కాల్ షీట్లను త్రివిక్రమ్ – అల్లు అర్జున్ కాంబినేషన్లో తెరెకెక్కబోయే సినిమాకి ఉపయోగించుకుంటానని త్రివిక్రమ్.. రష్మికకు నచ్చజెప్పినట్టు టాక్ వినిపిస్తుంది. ఆ చిత్రానికి కూడా ‘హారికా హాసిని క్రియేషన్స్’ వారే నిర్మాతలు కాబట్టి రష్మిక డేట్స్ ను అలా ఉపయోగించుకుంటున్నారన్న మాట..! దీంతో ‘భీష్మ’ చిత్రానికి మరో హీరోయిన్ ని వెతికే పనిలో చిత్ర యూనిట్ ఉన్నట్టు సమాచారం. ఈ విధంగా త్రివిక్రమ్… సమస్యని పరిష్కరించాడని ఫిలింనగర్ విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus