జై లవ కుశ లో నివేత థామస్ ను ఫైనల్ చేసుకున్న ఎన్టీఆర్ !

  • April 12, 2017 / 06:16 AM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న జై లవ కుశ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో వందకోట్ల బడ్జెట్ తో కల్యాణ రామ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో తారక్ పక్కన నటించే ఇద్దరు హీరోయిన్లు ఫిక్స్ అయ్యారు. బాబీ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ మూవీలో ఢిల్లీ భామ రాశీ ఖన్నా నటిస్తున్నట్లు గతనెలలో వెల్లడించిన చిత్ర బృందం, తాజాగా నివేత థామస్ హీరోయిన్ గా ఎంపికైనట్లు ప్రకటించింది. నాని జెంటిల్ మ్యాన్ సినిమాలో అభినయంతో ఆకట్టుకున్న నివేత తారక్ తో కూడా పోటీ పడి నటించనుంది. వీరిద్దరితో పాటు హంసానందిని నందిని గెస్ట్ రోల్ ల్లో తళుక్కుమని కనిపించనుంది.

ఈమె, ఎన్టీఆర్ కాంబినేషన్లో ఉన్న సీన్లు ప్రస్తుతం రామోజీఫిల్మ్ సిటీలో వేసిన ప్రత్యేక సెట్ లో తెరకెక్కిస్తున్నారు. మ్యూజిక్ డైరక్టర్ రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ మాస్, క్లాస్ ట్యూన్స్ ఇచ్చే పనిలో బిజీగా ఉన్నారు. బాలీవుడ్ కెమెరా మెన్ సీ కే మురళీధరన్, హాలీవుడ్ లెగసీ ఎఫెక్ట్స్ టెక్నీషియన్ వాన్సీ హార్ట్ వెల్  తదితరులు పనిచేస్తున్న జై లవ కుశ పై రోజు రోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus