శివరాత్రి నాడు సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పిన నివేతా థామస్

Advertisement

ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో పొరపాటు చేస్తుంటారు. దానిని సరి చేసుకొని జీవనం కొనసాగించాలి. ఇందుకు సెలబ్రిటీలు అతీతులు కారు. అప్పుడప్పుడు వారు కూడా తప్పులు చేస్తుంటారు. అయితే కొంతమంది ఆ తప్పుని సర్దిచెప్పుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. సోషల్ మీడియాలో అయితే చేసిన పోస్ట్ ని, కామెంట్ ని డిలీట్ చేస్తుంటారు. ఇలా మాత్రం నివేత థామస్ చేయలేదు. జెంటిల్ మ్యాన్, నిన్నుకోరి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయిన నివేతా థామస్ … జై లవకుశ మూవీలో ఎన్టీఆర్ పక్కన నటించి టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ జాబితాలో చేరిపోయింది.

ఈమె నిన్న శివరాత్రి సందర్భంగా అభిమానులకు పొరపాటున మకర సంక్రాంతి శుభాకాంక్షలు అని ట్వీట్ చేసింది. ఫాలోవర్స్ ఆ పొరబాటుని ఎత్తి చూపారు. దీంతో తప్పు తెలుసుకున్న నివేత వెంటనే క్షమాపణ కోరింది. అలాగే శివరాత్రి శుభాకాంక్షలు చెప్పింది. ఇంతటితో ఈ టాపిక్ ముగిసింది. విమర్శలు చేసిన వారు శాంతించారు. నివేత క్రిస్టియన్ అయినందున హిందు పండగల గురించి అవగాహన లేకపోవడంతో ఈ పొరపాటు జరిగిందని ఆమె సన్నిహితులు చెప్పారు.
ప్రస్తుతం నివేత మంచి కథల కోసం వెయిట్ చేస్తోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Also Read