రజనీకాంత్ ను పట్టించుకోని డిస్ట్రిబ్యూటర్లు

  • May 17, 2018 / 11:04 AM IST

సంచలనాలకు కేంద్రబిందువైన “కబాలి” చిత్రాన్ని భారీ ఆశలతో కొన్నారు కొందరు యువ నిర్మాతలు. దాదాపు 30 కోట్ల రూపాయలు పెట్టి ఆ సినిమా తెలుగు డబ్బింగ్ రైట్స్ దక్కించుకొన్న సదరు సినిమా కారణంగా దాదాపుగా 12 కోట్ల రూపాయలు నష్టపోవాల్సి వచ్చింది. దాంతో రజనీకాంత్ తాజా చిత్రం కొనడానికి నిర్మాతలెవరూ ముందుకురాలేదు. దాంతో చిత్ర నిర్మాత ధనుష్ స్వయంగా తనకు తెలిసిన నిర్మాతల ద్వారా తెలుగు రిలీజ్ ప్లాన్ చేసుకోవాల్సి వచ్చింది.

అయితే.. జూన్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానున్న ఈ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి కూడా ఎవరూ ఆసక్తి చూపకపోతుండడం గమనార్హం. దాంతో.. ధనుష్ ఓన్ రిలీజ్ ప్లానింగ్ లో ఉన్నాడు. ఒక సూపర్ స్టార్ సినిమాకి ఇలాంటి పరిస్థితి ఏర్పడడం అనేది బాధాకరం అనే చెప్పాలి. పా.రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో హ్యూమా ఖురేషీ కథానాయికగా నటించగా.. నానా పటేకర్ కీలకపాత్ర పోషించడం విశేషం. మరి ఈ సినిమా అయినా ఆయన అభిమానుల్ని సంతృప్తపరుస్తుందో లేక “కబాలి” తరహాలో నిరాశపరుస్తుందో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus