‘యూవీ క్రియేషన్స్’ వారు ఎన్నాళ్ళు టైం పాస్ చేస్తారు?

  • May 30, 2020 / 08:00 PM IST

‘బాహుబలి’ (సిరీస్) తర్వాత ప్రభాస్ ‘సాహో’ చిత్రం చేసాడు. ఈ చిత్రం ప్లాప్ టాక్ వచ్చినా.. ‘బాహుబలి’ పుణ్యమా అని భారీగానే కలెక్ట్ చేసింది. అయితే ప్రేక్షకులను ఏమాత్రం ‘సాహో’ ఆకట్టుకోలేకపోయింది.దీంతో ప్రభాస్.. ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ డైరెక్షన్లో చేస్తున్న తన 20 వ చిత్రం పైనే అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ‘యూవీ క్రియేషన్స్’ మరియు ‘గోపికృష్ణ మూవీస్’ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే 30 శాతం పూర్తయ్యింది.

లాక్ డౌన్ కు ముందు సెకండ్ షెడ్యూల్ కూడా పూర్తైంది. ఈ విషయాన్ని డైరెక్టర్ రాధా కృష్ణే స్వయంగా తన ట్విట్టర్లో తెలిపాడు. కానీ నిర్మాతలు మాత్రం ఆ విషయం పై అసలు స్పందించడం మానేశారు. దీంతో ‘#banUVCreations’ అనే ట్యాగ్ తో విపరీతంగా ట్రెండ్ చేసి.. ‘యూవీ క్రియేషన్స్’ వారిని ట్రోల్ చేసారు. దానికి వారు ఇప్పుడు క*నా వైరస్ వల్ల ఫస్ట్ లుక్ విడుదల చెయ్యడం సరికాదు అని.. త్వరలో విడుదల చేస్తాం అని చెప్పుకొచ్చారు.

కనీసం టైటిల్ ను కూడా అనౌన్స్ చెయ్యలేదు. కానీ ఇప్పటి వరకూ అలాంటిది ఏమీ జరగలేదు. ‘యూవీ క్రియేషన్స్’ వారు బాగా టైం పాస్ చేస్తున్నారు. మధ్యలో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభించిన పిక్స్ ను కొన్నిటిని రిలీజ్ చేసి చేతులు దులిపేసుకున్నట్టు ప్రవర్తిస్తున్నారు. దీంతో ‘ప్రభాస్ 20’ అప్డేట్స్ ఏమీ ఇప్పట్లో ఇచ్చేలా లేరని గుసగుసలు వినిపిస్తున్నాయి.

Most Recommended Video

రన్ మూవీ రివ్యూ & రేటింగ్
జ్యోతిక ‘పొన్‌మగల్‌ వందాల్‌’ రివ్యూ
ఈ డైలాగ్ లు చెప్పగానే గుర్తొచ్చే హీరోయిన్లు!
ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 12 సినిమాలు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus