నా మాట ఎవరూ వినడం లేదు : సమంత

  • September 3, 2018 / 01:37 PM IST

తమ్ముడు.. తమ్ముడే.. పేకాట పేకాటే.. అనే నానుడి బాగా పాపులర్. అదే విధంగా మొగుడు మొగుడే .. పోటీ పోటీనే అంటోంది సమంత. భర్త అని చూడకుండా అతని సినిమా రిలీజ్ రోజే తన సినిమాతో థియేటర్లోకి వస్తోంది. వినాయకచవితి సందర్భంగా ఈనెల 13 న నాగచైతన్య నటించిన “శైలజా రెడ్డి అల్లుడు”, సమంత మూవీ “యూటర్న్” రిలీజ్ అవుతున్నాయి. ఈ విషయం ఫిలిం నగర్లో హాట్ టాపిక్ అయింది. ఎక్కడ చూసినా ఎవరు గెలుస్తారు? ఎవరు హిట్ సాధిస్తారు? అని మాట్లాడుకుంటున్నారు. ఇటువంటి తరుణంలో తమ సినిమాల ఫైట్ పై సమంత చేసిన కామెంట్స్ చాలామందిని ఆశ్చర్యపరుస్తున్నాయి.

సమంత తాజాగా ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ.. “శైలజా రెడ్డి అల్లుడు” తో నా మూవీ యూటర్న్ పోటీ పడటం నాకు ఏ మాత్రం ఇష్టం లేదు. అందుకే రిలీజ్ డేట్ ను మార్చమని దర్శకుడు పవన్ కుమార్ కు, నిర్మాతకు ఎన్ని సార్లు చెప్పినా వారు పట్టించుకోలేదు” అని సమంత చెప్పింది. ఇంకా ఆమె మాట్లాడుతూ.. “యూటర్న్” నిర్మాతలు ఈమూవీకి మంచి ఓపెనింగ్స్ రావాలనే ఉద్దేశ్యంతో అందరి దృష్టిని ఆకర్షించడానికి .. చైతన్య సినిమాతో పోటీగా వదులుతున్నారు” అని వెల్లడించింది. అక్కినేని అభిమానులు మాత్రం ఈ పోటీ మంచిదేనని అంటున్నారు. పైగా “శైలజా రెడ్డి అల్లుడు”, “యూటర్న్” మూవీలు డిఫరెంట్ జోనర్స్ లో తెరకెక్కాయి కాబట్టి ఇబ్బందులు రావని నమ్ముతారు. రెండూ విజయం సాధిస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus