ఎన్టీఆర్ 27 వ సినిమాకి కెమెరామెన్ గా మురళీధరన్

  • January 17, 2017 / 08:02 AM IST

జనతా గ్యారేజ్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేయనున్న మూవీ పనులు ఊపందుకున్నాయి. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో తొలిసారి నటిస్తున్న తారక్ చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మించాలని నిర్మాత కళ్యాణ్ రామ్ ఫిక్స్ అయ్యారు. అందుకే ఉత్తమ టెక్నీషియన్లను, ఆర్టిస్టులను ఎంపిక చేసుకుంటున్నారు. బాబీ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఎన్టీఆర్ 27 మూవీ కోసం ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సీ కే మురళీధరన్ ని తీసుకున్నారు. ఈయన అమీర్ ఖాన్ హిట్ చిత్రాలు ‘3ఇడియట్స్’, ‘పీకే’ లకు సినిమాటోగ్రాఫర్‌ గా పనిచేశారు. తన ప్రతిభతో జాతీయ అవార్డులు అందుకున్నారు. తొలి సారి తెలుగు సినిమా కోసం పనిచేయబోతున్నారు.

ఈ విషయాన్నీ నిర్మాణ సంస్థ ఈ రోజు అధికారికంగా ప్రకటించింది. “అవార్డు విన్నింగ్ డీఓపీ సీ కే మురళీధరన్ ఎన్టీఆర్ 27 మూవీ కెమెరాను హ్యాండిల్ చేస్తున్నారని ప్రకటించడం మాకు ఆనందంగా ఉంది. సార్ ని మా టీమ్ లోకి సాదరంగా స్వాగతం పలుకుతున్నాం” అంటూ ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ఈనెల 26 నుంచి సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ మూవీలో ఎన్టీఆర్ మూడు పాత్రల్లో నట విశ్వరూపం ప్రదర్శించనున్నారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus