మాటల మాంత్రికుడుతోనే ఎన్టీఆర్ 28వ సినిమా

  • December 20, 2016 / 01:48 PM IST

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ మంచి స్నేహితులు. వీరిద్దరూ కలిసి చాలా కాలంగా సినిమా చేయాలనీ భావించారు. కానీ కుదరలేదు. జనతా గ్యారేజ్ తర్వాత సమయం దొరకడంతో తారక్ అనేక కథలు విన్నారు. వాటిలో త్రివిక్రమ్ చెప్పిన కథ బాగా నచ్చింది. అయితే ఆ డైరక్టర్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో ఓ ప్రాజెక్ట్ చెయ్యాల్సి ఉంది. దీంతో ఆలోచనలో పడ్డ ఎన్టీఆర్ మొదట బాబీ చెప్పిన కథకు పచ్చ జెండా ఊపారు.

ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో కళ్యాణ్ రామ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మూడు షేడ్స్ తో తారక్ కనిపించనున్న ఈ మూవీ సంక్రాంతి తర్వాత సెట్స్ మీదకు వెళ్లనుంది. తన 27 వ సినిమా ప్రీ ప్రొడక్షన్ దశలో ఉండగానే 28 వ ఫిల్మ్ ని యంగ్ టైగర్ సెట్ చేశారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటించేందుకు ఒకే చెప్పారు. క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కనున్న ఈ కుటుంబ కథా చిత్రాన్ని హారిక & హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై రాధాకృష్ణ  నిర్మించనున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది సెప్టెంబ‌ర్ లో సెట్స్ పైకి వెళ్ల‌నుంది. అయితే 2018 సంక్రాంతికి యంగ్ టైగర్ బరిలో దిగనున్నాడన్నమాట.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus