సావిత్రి బయోపిక్ లో డిజిటల్ ఎన్టీఆర్, ఏఎన్నార్

  • February 13, 2018 / 09:14 AM IST

‘కలిసుందాం రా’ సినిమాలో మహానటుడు ఎన్టీఆర్ ని తొలిసారి డిజిటల్ రూపంలో చూపించారు. వెంకటేష్, సిమ్రాన్ తో కలిసి ఎన్టీఆర్ స్టెప్పులు వేసి.. ప్రేక్షకులను ఆనందింపచేయించారు. రాజమౌళి తన యమదొంగ చిత్రంలో ఎన్టీఆర్ ని మళ్ళీ వెండితెరపైకి తీసుకొచ్చారు. తారక్, ఎన్టీఆర్ లను ఒకే ఫ్రేమ్ లో బంధించి విజిల్స్ వేయించారు. మరో మారు డిజిటల్ ఎన్టీఆర్ కనువిందు చేయనున్నారు. ఈ సారి అక్కినేని నాగేశ్వరరావు కూడా నేటి తరం నటీనటులతో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. ఈ అద్భుతమైన సన్నివేశం రూపకల్పనలో “మహానటి” చిత్ర బృందం బిజీగా ఉంది. అలనాటి నటి అభినేత్రి సావిత్రి బయోపిక్ మూవీని నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.

సావిత్రిగా కీర్తి సురేష్ కనిపించనుంది. ఇక అలనాటి మరో ప్రముఖ నటి జమున పాత్రను సమంత పోషిస్తోంది. వైజయంతి మూవీస్ పతాకంపై నిర్మితమవుతున్న ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్ జెమినీ గణేష్ పాత్రలో కనిపించనున్నారు. అలాగే విజయ్ దేవరకొండ, మోహన్ బాబు, క్రిష్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. వీరితో పాటు ఎన్టీఆర్, ఎన్నార్ కూడా ఉంటే బాగుంటుందని భావించిన చిత్ర బృందం పాత సినిమాల్లోని రూపాలకు మెరుగులు దిద్దుతున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతమందిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో మార్చి 29 న రిలీజ్ కానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus