వివాహ వార్షికోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకున్న ఎన్టీఆర్, లక్ష్మి ప్రణతి

  • May 5, 2017 / 01:41 PM IST

ఎన్టీఆర్ తన పెళ్లి రోజున ఎంతో సంతోషంగా గడిపారు. ఈరోజు మొత్తం  భార్య లక్ష్మి ప్రణతి కోసమే కేటాయించారు. ఆమెకి ఇష్టమైన వంటకాలను స్వయంగా వండి వడ్డించారు. ఆరేళ్ళ క్రితం ఇదే రోజున ( 5 మే  2011 ) ఎన్టీఆర్, లక్ష్మి ప్రణతి ఒకటయ్యారు. వారిద్దరి ప్రేమకు ప్రతిరూపంగా అభయ్ రామ్ పుట్టాడు. మూడు రోజుల క్రితం నుంచే వివాహ వార్షికోత్సవాన్ని మొదలెట్టారు. ముందుగా తిరుపతికి వెళ్లి  శ్రీవారిని దర్శించుకొని అశీసులు అందుకున్నారు. ఈ రోజు ఇంటికే పరిమితమైన వారిద్దరూ సాయంత్రం బంధు మిత్రులకు విందు ఇవ్వనున్నారు.

అందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఈ సెలబ్రేషన్ కోసమే బాబీ దర్శకత్వంలో చేస్తున్న జై లవ కుశ సినిమా చిత్రీకరణకు వారం రోజులు బ్రేక్ ఇచ్చిన్నట్లు తెలిసింది. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో కల్యాణరామ్ నిర్మిస్తున్న ఈ మూవీ మూడవ షెడ్యూల్ రేపటి నుంచి మొదలు కానుంది. గుజరాత్ లోసాగే ఈ షెడ్యూల్లో కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus