అన్నయ్య ఇమేజ్ డ్యామేజ్ చేసేందుకే ఈ కుట్ర!!!

  • April 18, 2017 / 11:44 AM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్… ఈ పేరు ఉంటే…అభిమానం ఉప్పొంగిపోతుంది…ఈ పేరు ఉంటే….మాస్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటారు…నందమూరి వారసుడిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్, కాలక్రమేణా….తనకంటూ మంచి ఫ్యాన్ బేస్ ను ఏర్పాటు చేసుకున్నాడు…ఇదిలా ఉంటే సినిమాల్లోనే కాకుండా, పొలిటికల్ గాను మంచి మైలెజ్ సంపాదించుకున్నాడు యౌన్ టైగర్…అయితే సినిమాల పరంగా దూసుకుపోతున్న ఎన్టీఆర్ పై విపరీతమైన విమర్శలు తెగబడుతున్నాయి…విషయం ఏమిటంటే….గతరెండు రోజులుగా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ పార్టీ పెట్టాడు అంటూ సోషల్ మీడియాలో విపరీతమైన వార్తల హడావిడి కనిపిస్తున్న విషయం అందరికీ తెలిసిందే….. ‘నవ భారత్ నేషనల్ పార్టీ’ పేరుతో ఓ లెటర్ హెడ్ సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈపార్టీ సింబల్ కూడా ‘జనసేన’ పార్టీ సింబల్ ను పోలి ఉండటం మరింత ఆశ్చర్య పరుస్తోంది. ఆ లెటర్ హెడ్ లో నవ భారత్ నేషనల్ పార్టీ వారు ఎన్టీఆర్ ను ప్రెసిడెంటుగా నియమిస్తున్నట్లు కనిపిస్తోంది.

‘భద్రతే మా లక్ష్యం-మానవతే మా నినాదం’ అన్న నినాదంతో హడావిడి చేస్తున్న ఈ లెటర్ హెడ్ వ్యవహారం తీవ్రమైన చర్చకు దారితీస్తుంది….ఎన్టీఆర్ యాంటీ ఫ్యాన్స్ దీన్ని సమర్ధిస్తుంటే…ఇదంతా ట్రాష్ అని….దీని వెనుక…ఎవరో ఉన్నారని….కావాలని అన్నయ్య పై బురద జల్లడానికి ఈ వ్యవహారం అంతా నడిపిస్తున్నారు అంటున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్…..అయితే ఇంత గొడవ జరుగుతూ ఉన్నా…ఎన్టీఆర్ స్పందించక పోవడంతో…టెన్షన్ పడుతున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్….ఇక దీనిపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం కాస్త గట్టిగానే రెస్పాన్స్ ఇస్తున్నారు…. ఇది అంతా ఎన్టీఆర్ ఇమేజ్ డ్యామేజ్ చేయడానికే ఇలాంటి ప్రచారం మొదలు పెట్టారని ఈవార్తలను నమ్మవద్దు అంటూ జరుగుతున్న ఈ దుష్ప్రచారానికి చెక్ పెడుతూ వస్తున్నారు…మరి దీనిపై ఎన్టీఆర్ ఒక క్లారిటీ ఇచ్చేస్తే….అంతా క్లియర్ అయిపోతుంది…చూద్దాం మరి ఎన్టీఆర్ ఏం చేస్తాడో..


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus